
పయనించే సూర్యుడు:జూన్ 30: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి.ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఛత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతంలో గల టేకులగూడెం గ్రామంలో ముందు జాగ్రత్తచర్యలలో భాగంగా సోమవారం మొదటి విడత దోమల మందు పిచికారి కార్యక్రమం నిర్వహించడం జరిగిందనీ తెలియజేశారు.
పంచాయతీరాజ్ శాఖ మరియు వైద్య ఆరోగ్యశాఖ సమన్వయంతో ప్రతి ఇంటికి దోమల మందు పిచికారి చేయడం జరుగుతుందనీ వెల్లడించారు.
ఈకార్యక్రమంలో హెచ్ఈఓ వేణుగోపాలకృష్ణ, పంచాయతీ కార్యదర్శి బి.రవీందర్ మరియు కారోబార్ కుర్సం సదానందం ఆరోగ్య కార్యకర్తలు తిరుపతి మరియు సుమలత ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
