Thursday, August 14, 2025
Homeఆంధ్రప్రదేశ్రాయికల్ గ్రామ భద్రతకు కొత్త అడుగు – రూ. 2 లక్షలతో సీసీ కెమెరాల ఏర్పాటు

రాయికల్ గ్రామ భద్రతకు కొత్త అడుగు – రూ. 2 లక్షలతో సీసీ కెమెరాల ఏర్పాటు

Listen to this article

సీసీ కెమెరాలను ప్రారంభించిన షాద్ నగర్ ఏసిపి లక్ష్మీనారాయణ

గ్రామ భద్రత కోసం ముందడుగు వేసిన రాయికల్ శ్రీనివాస్

హైవే పక్కన ఉన్న రాయికల్‌లో భద్రతా చర్యలు బలోపేతం..

( పయనించే సూర్యుడు ఆగస్టు 14 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )

రాయికల్ గ్రామంలో ఇటీవల వరుసగా జరిగిన దొంగతనాల ఘటనలతో గ్రామ ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొన్నది. ఈ పరిస్థితిని గమనించిన గ్రామానికి ఎల్లప్పుడూ అండగా నిలిచే గ్రామ నివాసి కాంగ్రెస్ యువ నాయకులు రాయికల్ శ్రీనివాస్, స్వయంగా రూ. 2,00,000 వ్యయంతో గ్రామమంతా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమం నేడు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షాద్‌నగర్ ఎసిపి లక్ష్మీనారాయణ, సిఐ విజయ్‌కుమార్ విచ్చేసి ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. “హైవే పక్కన ఉన్న రాయికల్ గ్రామం ఎల్లప్పుడూ రద్దీగా ఉండడం వల్ల భద్రతా చర్యలు అత్యవసరం. సీసీ కెమెరాలు నేరాలను అరికట్టడంలో, నేరస్థులను గుర్తించడంలో కీలకపాత్ర పోషిస్తాయి” అని పేర్కొన్నారు.
గ్రామ ప్రజల తరపున, గ్రామ భద్రత కోసం విశేషంగా సహకరించిన రాయికల్ శ్రీనివాస్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఆశన్న గౌడ్, మాజీ సర్పంచ్ దిద్దుల కృష్ణయ్య, మాజీ సర్పంచ్ పాండు నాయక్, మహిళా సంఘం నాయకురాలు యశోదమ్మ మరియు వాళ్ళ బృందం,  ఎర్రోళ్ల యాదయ్య , మహమ్మద్ సమద్, వార్డు మెంబర్ మెకానిక్ శంకరయ్య, ఒళ్ళు శేఖర్ రెడ్డి, కుమ్మరి జంగయ్య, దారమోని వెంకటయ్య, నూకల రామచంద్రయ్య, పాండు గౌడ్, బాసుపల్లి యాదయ్య, బ్యాగరి యాదగిరి, బ్యాగరి చిన్నయ్య, మాసగళ్ల చెన్నయ్య, బంగ్లకాడి శ్రీనివాస్, గడ్డపు కృష్ణయ్య,  డీజే వేణు, బాలు, ప్రశాంత్, సందీప్, అభి, కారోబర్ యాదయ్య, పాషా, బాసుపల్లి సత్యం తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments