
పయనించే సూర్యుడు //న్యూస్ మే 30//రిపోర్టర్ మక్తల్ సి తిమ్మప్ప//
మక్తల్ మండలం.ఈ రోజు జనసేన పార్టీ ఉపాధ్యక్షులు టీ టీ డి బోర్డ్ మెంబెర్ మహేందర్ రెడ్డి , తెలంగాణ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ గార్ల ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని మక్తల్ మండలం చిట్యాల గ్రామానికి చెందిన కమ్మరి శ్రీనివాస్ మరియు నర్సింహా ఆహ్వానం మేరకు వెళ్లిన డాక్టర్ మణికంఠ గౌడ్ మరియు నియోజకవర్గం సీనియర్ నాయకులు హనుమంతు,రామన్ గౌడ్ ,గౌడి బల్రెడ్డి, శివ, భీమేష్ ,పరుశురాం,మొదట స్టానిక శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం లో పూజా కార్యక్రమం నిర్వహించిన అనంతరం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాన్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి, నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు డాక్టర్ మణికంఠ గౌడ్ నేతృత్వంలో మక్తల్ మండలం , చిట్యాల గ్రామకు చెందిన కమ్మరి శ్రీనివాస్ మరియు నర్సింహా చొరవతో 40 మంది యువకులకు జనసేన పార్టీ కండువా కప్పి సాధారంగా వారిని పార్టీ లోకి స్వాగతించడం జరిగింది.