Sunday, June 15, 2025
Homeఆంధ్రప్రదేశ్అక్రమ ఇసుక తవ్వకాలను ఆపాలి వాడబలిజ సేవా సంఘం.

అక్రమ ఇసుక తవ్వకాలను ఆపాలి వాడబలిజ సేవా సంఘం.

Listen to this article

పయనించే సూర్యుడు; జూన్ 13: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి.ఎ.

వాజేడు:ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మవరం పట్టా ల్యాండ్ ఇసుక క్వారీలో అక్రమంగా ఆరు మీటర్ల నుండి ఏడు మీటర్ల వరకు లోతు ఇసుకనీతరలిస్తున్న ఇసుక కాంట్రాక్టర్లు.పట్టా ల్యాండ్ చట్టం ప్రకారం సుమారు రెండు మీటర్ల లోతు వరకు తీయాలని ప్రభుత్వం అనుమతులు ఇస్తే, కాంట్రాక్టర్ల ఇష్టానుసారంగ ఏడు మీటర్ల లోతు వరకు ఇసుకను తీసి తరలిస్తున్నారనీ, కనీసం సంబంధిత అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తెలంగాణ వాడ బలిజ సేవా సంఘం రాష్ర్ట అధ్యక్షుడు ఆరోపించారు. ఇలా ఇసుక ఎక్కువ లోతు తీయడం వలన గోదావరి ఒడ్డున ఆనుకుని ఉన్నటువంటి పంట పొలాలు వరదలు వచ్చినప్పుడు వరదలకు కొట్టుకుపోయే పరిస్థితులుఉన్నాయని,ప్రతి సంవత్సరం సుమారు వందల ఎకరాల్లో ఒడ్డు కొట్టుకుపోయి ఇసుక మేటలో కలిసిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయని, తెలంగాణ రాష్ట్ర వాడ బలిజ సేవాసంఘం అధ్యక్షుడు డర్రా దామోదర్ అన్నారు.కావున ప్రభుత్వ అధికారులు తక్షణమే ధర్మారం ఇసుక కోరిని పరిశీలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక తీసుకొనుట కొరకు అనుమతులు ఇవ్వాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర వాడ బలిజ సేవా సంఘం డిమాండ్ చేస్తుందనీ తెలియజేశారు. లేనియెడల దశలవారిగా ఉద్యమాలు ధర్నాలు రాష్ట్ర రోకలు నిర్వహిస్తామని డిమాండ్ చేశారు.
ఈయొక్క కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు డర్ర దామోదర్, రాష్ట్ర అధికార ప్రతినిధి తోట మల్లికార్జున రావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గగ్గూరి రమణయ్య, మండల అధికార ప్రతినిధి బొల్లె ఆదినారాయణ, ధర్మవరం గ్రామ కమిటీ అధ్యక్షులు గౌరారపు సర్వేశ్వరరావు, మండల కోశాధికారి పానెం సురేష్, రాష్ట్ర నాయకులు అల్లి సూరిబాబు, బొల్లె సూర్యం, బొల్లె శ్రీరాములు, వాజేడు మండల ఉపాధ్యక్షులు తునూరి రఘుబాబు, సంఘ యువ నాయకులు బొల్లె దేవ, అయ్యవారిపేట గ్రామ కమిటీ ప్రెసిడెంట్ గార రాంబాబు, డర్ర రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments