
పయనించే సూర్యుడు గాంధారి 29/06/25
అభినందించిన పాఠశాల యాజమాన్యం మరియు ఉపాధ్యాయ బృందం.
ఈరోజు కామారెడ్డి జిల్లాలోని ఇందిరా గాంధీ స్టేడియం లో నిర్వహించిన అథ్లెటిక్స్ సెలక్షన్లు గాంధారి మండల కేంద్రానికి చెందిన కే టి ఎస్ స్కూల్ విద్యార్థి మంజ కృష్ణమూర్తి (ఆరవ తరగతి) అథ్లెటిక్స్ 60 మీటర్ల విభాగంలో రాష్ట్రస్థాయికి సెలెక్ట్ అయ్యాడు అదేవిధంగా ప్రకాష్ తొమ్మిదో తరగతి విద్యార్థి జిల్లా స్థాయి మూడవ బహుమతి పొందడం జరిగింది. రాష్ట్రస్థాయికి సెలెక్ట్ అయిన విద్యార్థికి ప్రిన్సిపాల్ పరుశురాం,పాఠశాల డైరెక్టర్లు సూరత్ రామ్,హరి సింగ్, విజయ్,, పి ఇ టి లు సురేందర్, అనిల్ మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు.ఇతను జూలై 6 వ తేదిన వరంగల్ లోజరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ లో పాల్గొననున్నాడు.