
ఆలస్యమైతే నరకానికి..
గమ్య స్థలానికి చేరుతామనే నమ్మకాలు లేవు…
పయనించే సూర్యుడు; జూన్ 26; ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని మురుమూరు గ్రామపంచాయతీ సరిహద్దు ప్రగల్లపల్లి ఆరు గుంటపల్లి గ్రామాల మధ్యలోగాల ఉన్న దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం వెళ్ళు రహదారి లో పాలెం వాగు ప్రాజెక్టు నుండి వచ్చిన నీటి పిల్ల కాలువలు రోడ్డు దాటుట కోసం తవ్వి తూరలు అమర్చి పని పూర్తి అయ్యాక మళ్లీ తారు రోడ్డు వేయకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహిస్తున్నారు.ఈయొక్క కారణం వలన వర్షం కురిసి రోడ్డంతా బురదమయంగా మారుతుంది. వచ్చి పోయే ప్రయాణికులు అదుపుతప్పితే ఆసుపత్రికి, ఆలస్యం అయితే నరకానికి వెళ్ళవలసి వస్తున్నది. కానీ గమ్య స్థలానికి చేరుకుంటామో లేదో అని భయాందోళనకు గురవుతున్నారు. ఇక్కడ ప్రయాణం చేసే ప్రజల పరిస్థితులు ఇలా ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు ఈ పరిస్థితులను పరిశీలన చేసి శరవేగంగా తారు రోడ్డు వేయాలని ఈ యొక్క ప్రాంత ప్రజలు కోరుతున్నారు. అంతేకాకుండా ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకొని తగు జాగ్రత్తలు సూచనలు చేసి త్వరగా తారు రోడ్డు వేయాలని ప్రయాణికులు మరియు స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
