
పయనించే సూర్యుడు అనంతపురం టౌన్ ప్రతినిధి నాగేంద్ర జనవరి 29
బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ 23 లక్షల తీసుకున్న ఓ ఆగాంతకుడు మహిళను మోసం చేశాడు. సోషల్ మీడియాలో పరిచయమైన ఆ వ్యక్తి బ్యాంకులో టెలికాలర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మ బలికాడు. ఆమె మొదట కొంత నగదు ఆ వ్యక్తి ఖాతాకు జమ చేసింది. ఆమెను నమ్మించేందుకు అతను ఆ మహిళ కాకాపు తిరిగి నగదు వేశాడు. ఆ తర్వాత పూర్తిగా నమ్మిన ఆ మహిళ రెండు బ్యాంకు ఖాతాలో నుంచి రూ 23 లక్షల పంపి మోసపోయింది. స్థానిక ఉరవకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది.