
పయనం చేసే సూర్యుడు బాపట్ల ఏప్రిల్ 12:- రిపోర్టర్ (కే శివ కృష్ణ )
అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఫౌండేషన్ ప్రెసిడెంట్ ,గ్రామ ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాష తెలిపారు.కర్లపాలెం అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో ఇటీవల అగ్నిప్రమాదం జరిగి సర్వం కోల్పోయిన సాంబయ్య కు వంట సామాగ్రి ,దుస్తులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ముఖ్య అతిదిగా జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి పాల్గొని అందజేశారు.ఈ సందర్భంగా పఠాన్ అహ్మద్ బాష మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం ,నిత్యావసర సరుకులు ,దుప్పట్లు ,అనారోగ్యంగాఉన్న వారికి ఆర్థిక చేయూత అందించడం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ మస్తాన్ (ఆర్మీ సుబేదార్),టీడీపీ యూనిట్ నాయకులు మాడా శ్రీనివాసరావు, మునిపల్లే చిన్న,షేక్ ఇబ్రహీం, రియాజ్ బేగ్ ,బాపట్ల శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు