
కాంగ్రెస్ ఏకపక్షంగా ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ సరికాదు
అర్హులకు ఇండ్లు వచ్చేదాకా బిజెపి పోరాడుతుంది
- బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య
ఈరోజు రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు చిట్టెం లక్ష్మీకాంతరెడ్డి ఆధ్వర్యంలో మండల తహసిల్దార్, ఎంపీడీవో గార్లకు ఇందిరమ్మ ఇండ్లలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న చట్ట వ్యతిరేక విధానాలను అరికట్టాలని విజ్ఞాపన పత్రాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందే బాబాయ్య మాట్లాడుతూ, గూడులేని నిజమైన పేదలకు ఇండ్లు కట్టించాలనే సంకల్పంతో ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వేలకోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి పంపిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము తమ అనుయాయులకు ఇండ్లు కట్టబెట్టడం సరికాదని అన్నారు. గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి నిజమైన అర్హులను గుర్తించి, వారికే ఇండ్ల కేటాయింపు జరగాలని, అర్హులకు ఇండ్ల కేటాయింపు జరిగే వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని హెచ్చరించారు. ఇండ్ల కేటాయింపులో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని లేనిపక్షంలో ఇట్టి విషయంపై ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి చట్టపరమైన చర్యలు తీసుకునేలా కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు లక్ష్మయ్య గౌడ్, గుండేటి శివారెడ్డి మంగన్నగారి బలవంత రెడ్డి, కొమరమండ శ్రీశైలం, పసుపుల ప్రశాంత్, బోయ అశోక్, మల్చలం మురళి, వంశీకృష్ణ, కురుమయ్య, సున్నాల అంజయ్య, సురేష్, సిద్దు, ఎల్లయ్య , మహేష్, కార్తీక్ యాదవ్, రామచంద్రయ్య, రఘునాథ్ రెడ్డి, చంద్రశేఖర్, సందీప్ తదితరులు పాల్గొన్నారు
