Monday, March 17, 2025
Homeఆంధ్రప్రదేశ్అసెంబ్లీలో ప్రజల పక్షాన మాట్లాడడమే టిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి చేసిన తప్ప

అసెంబ్లీలో ప్రజల పక్షాన మాట్లాడడమే టిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి చేసిన తప్ప

Listen to this article
  • టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్..

పయనించే సూర్యడు // మార్చ్ // 15 // హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ // కుమార్ యాదవ్..

టిఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ పై హుజురాబాద్ లో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో రోడ్డుపై కూర్చొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రజల పక్షాన మాట్లాడడమే జగదీశ్వర్ రెడ్డి చేసిన తప్ప అన్నారు. ప్రభుత్వం అవలంబించిన విధివిధానాలు సరిగా లేవని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 15 నెలలు గడుస్తున్నప్పటికీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు మాత్రం అమలు కావడం లేదని తెలిపారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడుతున్నారు అని వివరించారు. ప్రజల పక్షాన మాట్లాడిన జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్స్ వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ గందె రాధిక శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్, మండల అధ్యక్షులు ఐలయ్య,కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్, ఉమామహేశ్వర్, కేశిరెడ్డి లావణ్య, ముక్క రమేష్, కుమార్, ఇమ్రాన్, ధనవర్ష రాజు లతో పాటు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments