
( పయనించే సూర్యుడు జూన్ 26 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి పేదల సొంతింటి కలను సాకారం చేస్తుందని కొండారెడ్డిపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు త్రిప్పిశెట్టి సుదర్శన్ అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ. ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ విడుతలవారీగా ఇందిరమ్మ ఇండ్లను అందిస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహకారంతో గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. అనంతరం లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, స్థానిక కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి స్వరూప్ కుమార్, మాజీ సర్పంచ్ రాజు, నాయకులు తార్నాక శ్రీనివాసరావు, లింగం ముదిరాజ్ పాల్గొన్నారు.