Sunday, June 29, 2025
Homeఆంధ్రప్రదేశ్ఎకో సెన్సిటివ్ జోన్ గ్రామసభలను నిలుపుదల చేయాలి,*

ఎకో సెన్సిటివ్ జోన్ గ్రామసభలను నిలుపుదల చేయాలి,*

Listen to this article

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ జూన్ 28,


ఏజెన్సీ ఆదివాసులను అడవుల నుండి గెంటి వేసే అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలో భాగంగా వైడ్ లైఫ్ నేషనల్ పార్క్ ఆనుకొని ఉన్న గ్రామాలను ఎకో సెన్సిటివ్ జోన్ పేరుతో ఖాళీ చేయాలని కుట్రలను ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు సీసం సురేష్ డిమాండ్ చేశారు.
శనివారం నాడు లక్కవరం గ్రామంలో గిరిజన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగినది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు సీసంసురేష్ మాట్లాడుతూ వైల్డ్ లైఫ్ నేషనల్ పార్క్ ఆనుకొని పది కిలోమీటర్లు పరిధిలో గ్రామాలలో గ్రామసభలు నిర్వహించి ఎకో సెన్సిటివ్ జోన్ ఏర్పాటుకు సమ్మతి తెలియజేస్తూ తీర్మానాలు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో రెవెన్యూ మరియు ఫారెస్ట్ సిబ్బంది గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నారని ఈ సభలను ప్రతి ఒక్క ఆదివాసి వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు ఏళ్ల తరబడి జీవన సంస్కృతిలో భాగంగా అడవులు కొండలు గుట్టలు నదులు మధ్య సహజీవనం చేస్తూ జీవిస్తున్న ఆదివాసులపై ప్రభుత్వాలు కుట్ర పన్నాయని కార్పొరేట్ అధినేతలు అయినా అంబానీ, అదాని, లకు ప్రకృతి సహజ సంపదను దోచిపెట్టేటందుకే ఏజెన్సీలో ఉన్న ఆదివాసీలపై ఎకోజెన్ పేరుతో దుర్మార్గంగా బయటికి నెట్టాలని చూస్తున్నారని అన్నారు తక్షణమే గ్రామ సభలను నిలుపుదల చేయాలని ఎకోజోన్ వ్యతిరేకిస్తూ తీర్మానాలు చేసి పంపించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అన్నారు, ఈ సందర్భంగా మాట్లాడుతూ జులై 6 తారీఖున చింతూరు మండల గిరిజన సంఘం మహాసభను లక్కవరం గ్రామంలో నిర్వహిస్తున్నామని ఈ మహాసభకు గిరిజన సంఘంరాష్ట్ర లోతా రామారావు, ఉపాధ్యకులు బొప్పన కిరణ్, జిల్లా నాయకులు పులి సంతోష్ హాజరవుతారని ఈ సందర్భంగా ఎన్నికల సందర్భంగా ఆదివాసీ లకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ పై మరియు ఏజెన్సీ ఆదివాసులకు నష్టం చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై రాబోయే రోజుల్లో ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని ఈ మహాసభలు జయప్రదానికి మండల కార్యకర్తలు అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగినది ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి కారం నాగేష్, నాయకులు పోడియం లక్ష్మణ్, కారం సుబ్బారావు, మడకం చిన్నయ, కలముల మల్లేష్, ధర్మల వీరభద్రం, సోడే లెనిన్, మడకం రామారావు, కలముల ముత్తయ్య, లక్ష్మయ్య, పూసం వీరయ్య. కలుముల ధారయ, తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments