
1). గోదాంను ప్రారంభిస్తున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి…
2). సమావేశంలో మాట్లాడుతున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి…
రుద్రూర్, జూన్ 30 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి):
రుద్రూర్ మండల కేంద్రంలో 15.00+33.00 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎరువుల గోదాం(గిడ్డంగి)ని శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు ఎరువుల కొరత లేకుండా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు ఎరువులను అందుబాటులో ఉంచాలన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను అభివృద్ధిలోకి తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, తహసీల్దార్ తారాబాయి, ఎంపిడిఓ భీమ్ రావు, సొసైటీ చైర్మన్ సంజీవరెడ్డి, మాజీ జడ్పిటీసి నారోజి గంగారాం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, పార్లమెంటు దిశా కమిటీ మెంబర్ నడిపింటి నగేష్, మాజీ ఎంపిపి అక్కపల్లి సుజాత, కాంగ్రెస్ పార్టీ నాయకులు పత్తి రాము, తోట సంగయ్య, పత్తి లక్ష్మణ్, అక్కపల్లి నాగేందర్, సొసైటీ సెక్రటరీ లక్ష్మణ్, సొసైటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.