
( పయనించే సూర్యుడు జూన్ 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ఈనెల 27, 28, 29 ,30 తేదీలలో కేరళ రాష్ట్రంలో జరిగే భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) 18వ జాతీయ మాహ సభలను విజయవంతం చేయాలి అని ఈరోజు ఎస్ఎఫ్ఐ షాద్ నగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో షాద్ నగర్ లోని ప్రజా సంఘాల ఆఫీస్ దగ్గర జాతీయ మహాసభల వాల్ పోస్టర్స్ విడుదల చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వడ్ల శ్రీకాంత్ మాట్లాడుతూ 1970 డిసెంబర్ 30న ఏర్పాటైన ఈ ఎస్ఎఫ్ఐ సంస్థ, విద్యార్థుల హక్కులు, సామాజిక న్యాయం, మరియు ప్రగతిశీల విద్యా విధానాల కోసం పోరాడుతోంది. ఎస్ఎఫ్ఐ ఏర్పాటు సిద్ధాంతం విద్యార్థి సమాజాన్ని సామాజిక మార్పు కోసం ఒక శక్తివంతమైన ఉత్ప్రేరకంగా ఉపయోగించడం మీద ఆధారపడి ఉంది.అని ఎస్ఎఫ్ఐ యొక్క సింద్ధాంతాలు మొదటిది విద్యా అనేది ప్రతి ఒక్కరి హక్కు.. అన్ని వర్గాల విద్యార్థులకు, ముఖ్యంగా వెనుకబడిన మరియు అణగారిన వర్గాలకు, నాణ్యమైన మరియు సరసమైన విద్య అందుబాటులో ఉండాలని నమ్ముతుంది.
సామజిక న్యాయం కోసం పోరాటం కుల మత,లింగ మరియు ఆర్థిక వివక్షలను రూపుమాపడానికి విద్యార్థి ఉద్యమాలను ఒక వేదికగా ఉపయోగిస్తుంది. దళిత, ఆదివాసీ, మైనారిటీ, మరియు మహిళా విద్యార్థుల హక్కుల కోసం పోరాడటం దీని ప్రధాన లక్ష్యం ప్రగతిశీల మరియు శాస్త్రీయ దృక్పథం ఎస్ఎఫ్ఐ విద్యా విధానం శాస్త్రీయ, లౌకిక, మరియు ప్రజాస్వామ్య ఆలోచనలపై ఆధారపడి ఉండాలని వాదిస్తుంది. మతోన్మాదం, మూఢనమ్మకాలు, మరియు రాజకీయ హస్తక్షేపం నుండి విద్యను కాపాడటం దీని సిద్ధాంతంలో కీలక భాగం. సామ్రాజ్యవాద వ్యతిరేకత ఎస్ఎఫ్ఐ ఏర్పాటు సమయంలో సామ్రాజ్యవాదం మరియు దోపిడీ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడే ఒక అంతర్జాతీయ విద్యార్థి ఉద్యమంగా ఆవిర్భవించింది. ఇది సోషలిస్ట్ ఆలోచనల నుండి ప్రేరణ పొంది, దోపిడీ రహిత సమాజ నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకొని పని చేస్తుంది అని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ టౌన్ అధ్యక్షాకార్యదర్శులు సుమయిర్, జి. శివ శంకర్ మరియు ఎస్ఎఫ్ఐ నాయకులు అదిల్,మొహమ్మద్ హాజీ, నితిన్ కుమార్, రాకేష్, సిద్దు, జాఫర్, వినయ్ తదితరులు పాల్గొన్నారు.