
పయనించే సూర్యుడు జూన్ 17 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మంత్రి ఆనం ఆదేశాలకు పోలీసుల కార్యరూపం మంత్రి ఆనం కి ధన్యవాదాలు తెలిపిన ఆత్మకూరు ప్రజలు నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై ఏఎస్ పేట క్రాస్ రోడ్డు వద్ద ఇటీవల వరుస ప్రమాదాల నేపథ్యంలో ప్రమాద నివారణ చర్యల కొరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు ఆనం రామనారాయణ రెడ్డి ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో ప్రమాద నివారణ చర్యలు చేపట్టమని ఉత్తర్వులు ఇవ్వడంతో వారి ఆదేశానుసారం ఆత్మకూరు పోలీసులు కార్యచరణ చేపట్టారు.ఏ ఎస్ పేట క్రాస్ రోడ్డు వద్ద రెండు వైపులా ప్రమాద నివారణ కొరకు ప్రమాద సూచిక బోర్డులను బ్యారీగేట్స్ .ఏర్పాటు చేశారు. తన నియోజకవర్గ పరిధిలోని జాతీయ రహదారిపై అలాగే మరికొంత ప్రాంతాలలో తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో ఇటువంటి ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేయమని మంత్రి ఆనం ఆదేశాలు ఇవ్వడంతో ఆదేశాలను అనుసరిస్తూ ఆత్మకూరు సిఐ గంగాధర్ ఎస్సైలు జిలాని సాయిప్రసాద్, శ్రీనివాసులు రెడ్డి తమ సిబ్బందితో కలిసి ఈ బోర్డులను ఏర్పాటు చేశారు.ఈ బోర్డుల ఏర్పాటు వల్ల వాహనాల వేగం తగ్గి నిదానంగా వెళ్లడం వల్ల ప్రమాదాల నివారణ అవుతాయి. ప్రజల ప్రాణ రక్షణ కోసం ప్రమాదల నివారణ చర్యల కొరకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించి వెంటనే వాటి నివారణ చర్యలకు ఆదేశాలు ఇవ్వడంపై ఆత్మకూరు ప్రజలు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కి వెంటనే స్పందించిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.
