
వీధి నాటకం కోసం 25,000 రూ అందజేసిన కొందుర్గ్ మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్
రాజేష్ పటేల్ ను ఘనంగా సన్మానించిన నిర్వాహకులు
( పయనించే సూర్యుడు జూన్ 09 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
గత 10 రోజులగా కొందుర్గు మండల కేంద్రంలో ప్రదర్శిస్తున్న చిరుతల రామాయణం వీధినాటకం కోసం ఇరవై ఐదు వేల రూపాయలను అందజేసిన కొందుర్గ్ మండల మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ 25,000/- నిర్వాహకులకు రాత్రి విరాళంగా ఇవ్వడం జరిగింది.నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపి సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు జగమొల్ల దేవమ్మ గోపాల్, ఆకుల ఇస్తారమ్మ మానయ్య, నాయకులు,గండేటి వేణుగోపాల్, సాయి, సచిన్,మోడ్స్ నర్సింలు, మల్లేష్, మోడ్స్ రాఘవేందర్,గ్రామస్థుల తదితరులు పాల్గొన్నారు
