
పిల్లలకు అక్షర బ్యాసం చేయించిన అంగన్వాడీ టీచర్లు
( పయనించే సూర్యుడు జూన్ 17 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండల పరిధిలోని కడియాల కుంట తండా గ్రామ పంచాయతీలో గల అంగన్వాడీ కేంద్రంలో (ఈసీసీఈ) డే ను అంగన్వాడీ టీచర్ సుజాత నిర్వహించారు. ఈ డే అంగన్వాడీ కేంద్ర పరిధిలో గల సున్నా నుండి ఐదేళ్ల వయసు వరకు ప్రతి పిల్లవాడి పై వ్యక్తిగత శ్రద్ధ, ఆరోగ్య సంరక్షణ మరియు జీవన విధానంపై వారి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తామని పర్యవేక్షకురాలు సుజాత తెలిపారు. పుట్టినప్పటి నుండి ఎనిమిదేళ్ల వరకు పిల్లల సమగ్ర అభివృద్ధిపై దృష్టి పెడతామన్నారు. కేంద్రంలో ఆట ఆధారిత కార్యక్రమాల ద్వారా వారి శారీరక, మానసిక సామాజిక, అబిజ్ఞ మరియు సృజనాత్మక నైపుణ్యాలను పెంపొందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు మరియు పిల్లల తల్లిదండ్రులు ఏ ఎల్ ఎం ఎస్ సి కమిటీ సభ్యులు మనీ, దివ్య , కల్పన, అనిత, చాప్లి తదితరులు పాల్గొన్నారు.