
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 25 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మెగావాత్ నరేందర్ నాయక్ ) షాద్నగర్ నియోజకవర్గం కొందుర్గు మండల కేంద్రంలో జరిగిన మూడవ జిల్లా స్థాయి కరాటే అండ్ కుంఫు ఛాంపియన్షిప్ లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కొందుర్గు మండల మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరాటే తో మానసిక శారీరక శక్తి పెంపొందుతుందని మరియు విద్యార్థులు ఎంతో ఎంతో చురుకుగా ఉంటారని అందరూ తప్పకుండా కరాటే నేర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు అనంతరం గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ రమేష్ సీనియర్ మాస్టర్ నరేందర్ నాయక్ వినయ్ పీరు తదితరులు పాల్గొన్నారు