Tuesday, July 1, 2025
Homeఆంధ్రప్రదేశ్కరెంటు సమస్యను గ్రామాలలో పరిష్కరించాలని విద్యుత్ కార్యాలయం ముట్టడించిన సిపిఎం పార్టీ *

కరెంటు సమస్యను గ్రామాలలో పరిష్కరించాలని విద్యుత్ కార్యాలయం ముట్టడించిన సిపిఎం పార్టీ *

Listen to this article


పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూన్ 30 అల్లూరి సీతారామరాజు జిల్లా

ఈరోజు కూనవరం మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా భీమవరం కరెంట్ సబ్ స్టేషన్ లో సిపిఎం పార్టీ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. జిల్లా నాయకులు మేకల నాగేశ్వరావు మాట్లాడుతూ గత వారం రోజుల నుండి మండలంలోని గ్రామాలకు కరెంటు లేక కటిక చీకట్లలో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మగ్గుతున్న మండల ప్రజానీకం. కానీ ఇప్పటివరకు స్పందించకపోవడం కూటమి ప్రభుత్వం గాని మరియు ఉన్నతాధికారులు గాని చాలా బాధాకరం.రెండు మండలాల ప్రజలు కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి తక్షణమే కరెంటు సమస్యను పరిష్కరించాలని సిపిఎం పార్టీ మండల నాయకత్వం డిమాండ్ చేస్తున్నాం ఈ విషయంపై కరెంటు AE గారికి సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు నాయకత్వం మెమొరన్న ఇవ్వడం జరిగింది సబ్ స్టేషన్ ఏఈ గారు ఈ విషయంపై మాట్లాడుతూ సబ్ స్టేషన్ లోనే సాంకేతిక లోపం తలచడం వలన దాన్ని పై అధికారులు వచ్చి ఇష్టమేసిన వేసి పంపించడం జరిగింది తర్వాత గతిన పూర్తి చేసి ఈ సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల నాయకత్వం పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments