
పయనించే సూర్యుడు గాంధారి 07/06/25
మండల కేంద్రంలోని తిప్పారం తాండ గ్రామపంచాయతీ పరిధిలో గల శ్రీ శ్రీ కోదండ రామచంద్రస్వామి ఆలయాన్ని 2019లో శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి వారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆనాటి నుండి నేటి వరకు ఆలయ పనులు సాఫీగా జరుగుతున్నాయి. ఈ ఆలయానికి నేటితో దాదాపు 5 కోట్ల వరకు ఖర్చు అయ్యాయి. అయితే ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి ఆదేశాల మేరకు కోదండ రామచంద్రస్వామి ఆలయాన్ని శ్రీ పరసార రఘునాథ బట్టర్ స్వామి రంగధామము ఆస్థాన ఆచార్యులు రాజమండ్రి శ్రీరంగనాథం శ్రీ రంగం ఆస్తానులు, దత్త వెంకటాచార్యులు ముచ్చింతల్ ఆశ్రమము వేద పండితులు మరియు శ్రీమన్ సంపత్ కుమార్ ఆచార్యులు వేద పండితులు ఆలయాన్ని సందర్శించి తగు సూచనలు ఇచ్చారు. మిగిలిన ఆలయ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆలయ కమిటీ సభ్యులైన బిశన్ నాయక్, టీకారాం, గంగారాం, పెంటయ్య, మాధవరావు, న్యాల్ సింగ్, దేవిసింగ్ మరియు గ్రామ ప్రజలకు తగు సూచనలు ఇచ్చారు. 80 కుటుంబాలు ఉన్న తిప్పారం తండాలో రామాలయాన్ని నిర్మించడం గొప్ప పుణ్య విషయమని వారు తెలిపారు.