
బి.ఆర్.ఎస్.పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మర వరప్రసాద్ గౌడ్ డిమాండ్
పయనించే సూర్యుడు జూన్ 23 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి:రాష్ట్ర బి. ఆర్. స్. పార్టీ ఆదేశాల మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు రేగ కాంతారావు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆదేశాల మేరకు ఇల్లందు నియోజకవర్గంలోని టేకులపల్లి మండలం బొమ్మనపల్లి గ్రామపంచాయతీలో బి.ఆర్.ఎస్ పార్టీగ్రామ శాఖ అధ్యక్షులు నల్ల మాస నరేందర్ అధ్యక్షతన గ్రామపంచాయతీ ముందు ధర్నా చేయడం జరిగినది అందులో భాగంగా గ్రామ పంచాయతీ సెక్రెటరీకీ వినతి పత్రం ఇవ్వటం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టేకులపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వరప్రసాద్ గౌడ్ హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కి 18. నెలలు గడిచినప్పటికీ గ్రామాలలో పట్టణాలలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాన పట్టణాలు మరియు పంచాయతీలు మురికి కూపాన్ని తలపిస్తున్నాయని వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపిస్తున్నకనీసం మురికి గుంటల వద్ద బ్లీచింగ్ చల్లే నాధుడే లేకుండా పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు పంచాయతీకి రావలసిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.పార్టీ డిమాండ్స్ అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని మంచినీటి బావులు మురికి నీరు ఆగి ఉన్నచోట బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని ఇండ్లలోని చెత్తను ప్రతిరోజు సేకరించి డంపింగ్ యార్డ్ కు తరలించాలని దోమల నివారణ కోసం పలు జాగ్రత్తలు చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడాలని మండలంలో పైలెట్ ప్రాజెక్టుగా ఎంచుకున్న గ్రామపంచాయతీలో స్పెషల్ ఆఫీసర్లు నియమించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో బుర్రి వెంకటేశు బండి రాంబాబు లాకావత్ వంశీ దొడ్ల శంకర్ ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు నునావత్ బాలాజీ నాయక్ నరేష్ బుర్రి జగదీష్ చలమల్ల నరేందర్ కక్కర్ల సురేష్ ఉప్పల శ్రీనివాస్ సందీప్ మరియు తదితరులు పాల్గొన్నారు టేకులపల్లి గ్రామపంచాయతీలో బోడ బాలు నాయక్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు పంచాయతీ సెక్రెటరీ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది