Tuesday, June 24, 2025
Homeఆంధ్రప్రదేశ్చింతూరు సెంటర్ లోని అడివిశాఖ భూముల్లో ఆక్రమనలు తొలగించాలి.

చింతూరు సెంటర్ లోని అడివిశాఖ భూముల్లో ఆక్రమనలు తొలగించాలి.

Listen to this article

చింతూరు అటవీ శాఖ AO గార్కి వినతి

ఆదివాసి సంక్షేమ పరిషత్ (274/16)

పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ జూన్ 23

చింతూరు సెంటర్ రామాలయం రోడ్, మెయిన్ రోడ్, సినిమహల్ రోడ్డు కి మధ్యలో గల స్థలము అటవీ శాఖ కి సంబంధించనది. ఆ స్థలం లోని నాన్ ట్రైబల్స్ అక్రమ కట్టడాలు ( నివాస గృహాలు మరియు వ్యాపార సముదాయాలు) తొలగించి ఆ స్థలాన్ని అటవీ శాఖ వారు స్వాధీనం చేసుకోవాలని ఆదివాసి సంక్షేమ పరిషత్ (274/16) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను చింతూరు DFO కార్యాలయం లో AO గార్కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సదర్భంగా అయన మాట్లాడుతూ సిల్వర్ జూబ్లీ పార్క్ గా పిలవబడే ఆ స్థలాన్ని 2011-2012 నుండి నాన్ ట్రైబల్స్ ఆక్రమించుకుని స్థిర నివాసాలు, వ్యాపార సముదాయాలు నిర్మించు కున్నారని అన్నారు. వారికీ గతంలో ఖాలిచేయలి ఆని నోటీస్ లు జారీచేసినప్పటికీ ఇప్పటి వరకు ఎవరు కాళీ చేయక పోగా, ఒకరిని చూసి మరొకరు ఆ స్థలాన్ని ఆక్రమించుకున్నారు ఆని అన్నారు. ఏజెన్సీ లో హక్కు ఉన్న ఆదివాసీలు ఏదైనా ప్రభుత్వ, అటవీ శాఖ భూముల్లో గుడిసెలు వేసుకుంటే అదివసిల గుడిసెలను తగలపెట్టడం లేద బుల్డోజర్ లతో తోసి వేయడం చేస్తారు అధికారులు, కానీ సంవత్సరాల తరబడి అటవీశాఖ సంబంధించిన భూములలొ అక్రమ నిర్మాణాలు కట్టి వ్యాపారాలు చేస్తున్నా గాని వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరమని ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ విషయాన్ని చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ (CCF), రాజమండ్రి వారి దృష్టికి కూడా తీసుకెళ్లనున్నట్లు ఈ సంద్భంగా తెలియ జేశారు. అలాగె చింతూరు తొ పాటు చింతూరు డివిజన్ లో నాలుగు మండలాల్లో గల నాన్ ట్రైబల్స్ అక్రమ కట్టడాలు తక్షణమే కూల్చి వేయాలని ఈరోజు(సోమవారం) చింతూరు ITDA కార్యాలయం లో పిర్యాదు చేసినట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments