
పయనించే సూర్యుడు: జూన్ 20: మక్తల్
రుతుపవనాలు ఈసారి 10 రోజుల ముందే రాష్ట్రంలోకి ప్రవేశించి రైతులను మురిపించాయి దీంతో అన్నదాతలు ఉరిమే ఉత్సాహంతో పొలాలు చదును చేసుకుని విత్తనాలు నాటారు. తర్వాత పరిస్థితి తారుమారయింది. తొలకరిలో విత్తనాలు వేసుకున్న రైతులు గత పది రోజులుగా చినుకు జాడ లేక విలవిలాడుతున్నారు. ప్రతిరోజు పొలంవైపు, ఆకాశం వైపు చూడడం రైతుకు దినచర్యగా మారింది. దైవం కరుణించి ఇప్పటికైనా వరుణుడు తమపై కరుణ చూపిస్తాడని రైతులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.
