
పయనించే సూర్యుడు జూన్ 17 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మండల కేంద్రమైన చేజర్ల వ్యవసాయ శాఖ కార్యాలయంలో మండల వ్యవసాయ అధికారిగా పి. ఎస్ .హిమబిందు సోమవారం బాధ్యతలు స్వీకరించారు, సాధారణ బదిలీలు భాగముగా ఇక్కడ పని చేస్తున్న వ్యవసాయ అధికారి శశిధర్ సంఘం మండలం కి బదిలీ అయ్యారు ఆయన స్థానంలో నెల్లూరులో పనిచేస్తున్న హిమబిందు చేజర్ల మండలానికి బదిలీ అయి వచ్చారు. ఈ సందర్భంగా కార్యాలయం సిబ్బంది వచ్చి స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి పి. ఎస్ .హిమబిందు మాట్లాడుతూ రైతులకు న్యాయమైన ఎరువులు పురుగు మందులు సకాలంలో అందేచేలా కృషి చేస్తానని తెలిపారు.అంతేకాకుండా అన్నదాత సుఖీభవ ఈ కేవైసీ ఈ నెల 20 తేది లోపుల త్వరగా పూర్తి చేసుకోవాలని తెలిపారు. రైతులకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ ఎస్ . ఎల్ల.సుజాత, డివి సుబ్బారావు . వి ఏ ఏ ఎస్. వి హెచ్ ఏ ఎస్ తదితరులు పాల్గొన్నారు