
(పయనించే సూర్యుడు అక్టోబర్ 14 రాజేష్)
దౌల్తాబాద్ మండల కేంద్రం మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో; మెదక్, సంగారెడ్డి పట్టణాలలో సోమవారం జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్ విభాగంలో అండర్ 19 మరియు 14 విభాగంలో గురుకుల కళాశాల మరియు పాఠశాల విద్యార్థులు 11 మెడల్స్ సాధించారు . రాష్ట్రస్థాయి క్రీడల కోసం విద్యార్థులు అండర్ 14 (విష్ణు వర్ధన్. దేవీ దాస్, భాను ప్రసాద్, గణేష్, గిరీష్); అండర్ 19 భరత్ మరియు జశ్వంత్ రాష్ట్ర స్థాయికి ఎంపిక కావడం జరిగిందని పాఠశాల ప్రిన్సిపాల్ స్వప్న తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు గ్రామీణ స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ కావడం గర్వించదగ్గ విషయమని ఆమె కొనియాడారు. విద్యార్థులను వ్యాయామ ఉపాధ్యాయులు సాయి కృష్ణ, బస్వరాజ్, డాంబు అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
