
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు
డివిజన్ ఇంచార్జ్ 20 సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సీఐటీయూ )చింతూరు ముఖ్య నాయకులు సమావేశం శ్యామల వెంకటరెడ్డి భవనంలో రవ్వ వీరమ్మ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది ఈ సమావేశానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారుఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. దేశంలో మూడవసారి బిజెపి కేంద్రంలో అధికారంలో వచ్చిన తర్వాత కార్మికులు చట్టాలన్ని కూడా రద్దు చేయాలని ఆయనకి అనుకూలంగా మార్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ఆరోజు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేస్తే కార్మికు చట్టాలు హక్కు లు ఆరోజు సాధించుకోవడం జరిగింది.. ఇప్పుడు బిజెపి ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేయాలి కార్మికు హక్కులన్నీ కూడా రద్దుచేసి కార్మికులకు వ్యతిరేకంగా నాలుగు లేబర్ కొడ్ తీసుకురావడం జరుగుతుంది అదే నాలుగు లేబర్ కోడ్ లు మాత్రం తీసుకొస్తే కార్మిక హక్కులన్నీ కూడా రద్దైపోతే అన్నారు కార్మికులా వ్యతిరేక విధానాలను తీపి కొట్టడానికి జులై 9న దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెను జయప్రదం చేయాలన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నికల హామీలన్నీ కూడా ఇవ్వడం జరిగింది అది ఏదో ఒకటి కూడా కార్మికులకి అనుకూలంగా లేనందున రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకి అందరికీ మోసం చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి పొడియం లక్ష్మణ్. మండల కమిటీ సభ్యులు కారం సుబ్బారావు. చింత రాంబాబు. తెపల లక్ష్మయ్య. జయలక్ష్మి. సుశీల. మడకం శ్రీదేవి. లక్ష్మి. రాములమ్మ. చంద్రయ్య. తదితరులు పాల్గొన్నారు