
టి ఏ సి కమిటీకి అభినందనలు ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి ని కలిసిన ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఏసి
మెగా డిఎస్సి నుండి ఏజెన్సీ పోస్ట్లు మినహాయించాలని డిమాండ్
పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జి మే 23
ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి రాష్ట్ర కమిటీ రాష్ట్ర సచివాలయం, అమరావతి పర్యటనలో రెండవరోజు – టి ఏ సి ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఏసి. తన పేషి లో ప్రత్యేక కార్యదర్శి ప్రద్యుమ్న ను కలిసి మెగా డిఎస్సి – 2025 లో ప్రకటించిన షెడ్యూల్ ప్రాంత పోస్టులను మినహాయించి, ప్రత్యేక సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. నూతనంగా అర్పడ్డ టిఏసి తక్షణమే సమావేశమై ” షెడ్యూల్డ్ ఏరియా ఉధ్యోగ నియామక చట్టం చేయుడానికి పూనుకోవాలని డిమాండ్ చేశారు. గత 14వ తారీకు నుంచి రాష్ట్రంలోని అన్ని ఐటీడీఏల ముందు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల ప్రభావం కారణంగా టి ఏ సి ఏర్పాటు, షెడ్యూల్ ప్రాంత నియామకల చట్టం చేయడానికి ప్రభుత్వం చొరవ తీసుకున్నప్పటికీ, ఈ డీఎస్సీలో ప్రకటించిన ఏజెన్సీ పోస్టులను మినహించి ప్రత్యేక నోటిఫికేషన్ ఇవ్వని యెడల ఆదివాసి నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉన్నది. ఏజెన్సీ ప్రాంతాలకు ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృశ్య ప్రభుత్వం పునరాలోచించి ఈ నోటిఫికేషన్ నుంచి మినహాయించి ప్రత్యేక సప్లమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనలో ఉన్న ఆదివాసి యువత ఉద్యమాన్ని ఉదృతం చేస్తారని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఏసి గౌరవ అధ్యక్షులు పార్వతి పురం మాజీ ఎం ఎల్ ఎ నిమ్మక జయ రాజు, వైస్ ఛైర్మెన్ మొడియం శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ముక్కి శేషాద్రి, కేంద్ర కమిటీ సభ్యులు మడివి నెహ్రూ, కోర్ కమిటీ సభ్యులు కంగాల శ్రీనివాసరావు, ఏ ఎస్ ఆర్ జిల్లా చైర్మన్ రామారావు దొర, ఏ టి ఏ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు తెల్లం రాములు, ఆదివాసి మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు తుష్టి జోగారావు, అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం ఎఎస్ఆర్ జిల్లా బోయపల్లి సింహాచలం, ఎపిసిపిఎస్ఇఎ ఎఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు మసడా ఈశ్వరరావు, జిఎస్ యు ఏఎస్సార్ జిల్లా అధ్యక్షులు కిషోర్ కిరసాని. ఎఐఎఇఫ్ సలహాదారులు పొడియం పండు దొర, ఎఎస్పి రాష్ట్ర ప్రచార కార్యదర్శి తెల్లం లక్ష్మనరావు, ఎపిఎజేఏసీ ఏలూరు జిల్లా కార్యదర్శులు తెల్లం రవి ప్రసాద్, సరియం కన్నపరాజు, ఆదివాసి యువజన సంఘం జిల్లా అధ్యక్షులు సోదేం నవీన్ కుమార్ మాదాల చంటి తదితరులు పాల్గొన్నారు.