
పయనించే సూర్యుడు జూన్ 02 (పొనకంటి ఉపేందర్ రావు )
సోమవారం టేకులపల్లి మండలంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు, టేకులపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ లంకపల్లి వీరభద్రం, ఎంపీడీఓ ఎంపీడీఓ గణేష్ గాంధీ, టేకులపల్లి,పోలీస్ స్టేషన్, బోడు పోలీస్ స్టేషన్, మరియు ప్రభుత్వ పాఠశాలలో అంగన్వాడి కేంద్రంలో, పంచాయతీ కార్యాలయంలలో, తెలంగాణ దినోత్సవం సందర్భంగా, ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు, జాతీయ జెండా ఆవిష్కరించారు, ఈ సందర్భంగా వారు, తెలంగాణ సాధించటంలో తెలంగాణ ఉద్యమకారులను మరియు తెలంగాణ పోరాటంలో ఆత్మ బలిదానాలు చేసిన వారి గుర్తు చేస్తూ, వాళ్ల చిత్రపటాలకు, పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంతోమంది ఆత్మ బలిదానాల వల్ల తెలంగాణ సాధించుకున్నామని
వారిని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ ఉన్నత అధికారులు, రాజకీయ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.