Tuesday, June 17, 2025
Homeఆంధ్రప్రదేశ్తెలంగాణ పిసిసి పార్టీ పదవుల్లో కార్యవర్గ విస్తరణలో కూకట్పల్లికి సమచితస్థానం లభించిoది.జిట్ట సునీల్ కుమార్ యాదవ్....

తెలంగాణ పిసిసి పార్టీ పదవుల్లో కార్యవర్గ విస్తరణలో కూకట్పల్లికి సమచితస్థానం లభించిoది.జిట్ట సునీల్ కుమార్ యాదవ్. రాచ మల్ల శేఖర్ గౌడ్

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 10 తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి

కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ని పార్టీ ఉపాధ్యక్షుడిగా అధిష్టానం నియమించింది. ఈ మేరకు సోమవారం పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ కేసి వేణుగోపాల్ నుండి ఉత్తర్వులు విలువడ్డాయి. దీంతో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానుల్లో ఉత్సాహం వెల్లువెత్తింది. మూసాపేట్ లోని పార్టీ కార్యాలయంలో నాయకులు రమేష్ ని కలిసి పుష్ప గుచ్చాలు, బొకేలు శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. పది సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కి నగరంలో ఒక్క ఎమ్మెల్యే లేకుండా పోయారు.దీంతో పార్టీ తరఫున పోటీ చేసిన వారిని ఇన్చార్జిలుగా అధిష్టానం నియమించింది .దీంతో నియోజకవర్గాల్లో పార్టీకి కొంతమేర జోష్ వచ్చింది. కూకట్పల్లి నుండి పోటీ చేసిన రమేష్ ని నియోజకవర్గ ఇన్చార్జిగా నియమితులయ్యారు. నాటినుండి నిత్యం పార్టీకి ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ సమస్య ఏదైనా ఎంత పెద్దదైనా పరిష్కరించేందుకు శక్తిమేర కృషి చేసారు. దీంతో ఆరు నెలల వ్యవధిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క కూకట్పల్లి నియోజకవర్గం నుంచే ఇరవై వేల ఓట్లు అధికంగా సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా రమేష్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్న విధానం కార్యకర్తలు లకు అందుబాటులో ఉన్న తీరు సమస్యల పరిష్కారం కోసం ఆయన చూపే చొరవ నిజాయితీ, పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధానం అధిష్టానం దృష్టిలో పడింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రమేష్ ని మాత్రమే పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించేలా చేసింది. దివంగత కాంగ్రెస్ నేత మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి మరణంతో ఉమ్మడి ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో సరైన నాయకత్వం లేక పార్టీ శ్రేణులు పూర్తిగా డీలాపడ్డాయి. గత టిఆర్ఎస్ ప్రభుత్వo కాంగ్రెస్ నాయకుల పై లెక్కకు మిక్కిలి కేసులు పెట్టి వేధించి పార్టీని పూర్తిగా బలహీనపరిచింది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పోరాటంతో మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణలో అధికారంలోకి రావడం మళ్లీ పార్టీ పునర్జీవం పొందినట్లయిoది. నాటి పిసిసి అధ్యక్షుడు నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రమేష్ ని కూకట్పల్లి నియోజకవర్గoలో పోటీలో దించారు. సీఎం నమ్మకాన్ని వమ్ము చేయకుండా రమేష్ ముందుండి పార్టీని నడిపిస్తున్నారు. అన్నా అంటే నేనున్నా అంటూ పిజెఆర్ ను మరిపించేలా రమేష్ ప్రజల కోసం కార్యకర్తల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. రమేష్ మరిన్ని ఉన్నత పదవులు పొందాలని అధిష్టానంతో పాటు నాయకులు కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో జిట్టా సునీల్ కుమార్ యాదవ్ రాచమళ్ళ శేఖర్ గౌడ్ ఆసిఫ్ ఖాన్ ఎన్ ఎస్ యు ఐ రాహుల్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments