
కూటమి ప్రభుత్వ పాలనలో ఛోటా నాయకులు తీరు
పయనించే సూర్యుడు జూన్ 8 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఆత్మకూరు నియోజకవర్గంలో కూటమి నాయకుల దోపిడీ దొరికితే దొంగలు దొరక్కపోతే దొరలు అన్న చందంగా మారిందని వైఎస్ఆర్సిపి నాయకులు పేర్కొన్నారు.ఆత్మకూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణంలోని పాత ఎంపీడీవో కార్యాలయ భవనం కూల్చివేసి అందులో విలువైన కలపను చెర్లోయడవల్లి గ్రామానికి ఎందుకు తరలించారో, ప్రజాప్రతినిధులు, అధికారులు సమాధానం చెప్పాలన్నారు. ప్రజా ప్రతినిధికి దోచి పెట్టేందుకు ఈ విధంగా సహకార అందిస్తున్నారా లేదా ఆయనకు భయపడి ప్రభుత్వాదాయానికి గండికోడుతున్నారా ప్రజలకు వివరించాలన్నారు. గతంలోనూ ఇదే విధంగా నారంపేట వద్ద సుమారు రెండు కోట్ల విలువైన జామాయిల్ ను నరికి సొమ్ము చేసుకున్న విషయం మరువక ముందే మళ్లీ లక్షల విలువ చేసే కలపను తన ఇంటికి చేర్చుకోవడం వారి దోపిడీకి మీ స్థాయిలో ఉందో తెలియజేస్తుందన్నారు.రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఈ విషయం ఇప్పటికే తెలిసి ఉంటుందని, దీని పై పూర్తిగా విచారణ జరిపించాలని కోరుతున్నామన్నారు.మంత్రి పేరు చెప్పుకొని అధికారులను భయపెట్టి ఇలా గ్రామాలకు తరలించిన విలువైన కలపను సోషల్ మీడియాలో వార్తలు ప్రసారం కాగానే మళ్లీ ఎంపీడీవో కార్యాలయానికి తీసుకొచ్చారని, తీసుకెళ్లిన దాంట్లో 30% మాత్రమే వెనక్కి వచ్చినట్లుగా తెలుస్తోందని దీనిపై కూడా సదరు అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి ప్రభుత్వ ఆదాయం గండి కొడుతున్న ఆ ప్రజాప్రతినిధిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ చిల్లూరు ఆదిశేషయ్య, పార్టీ పట్టణ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్ రెడ్డి, జడ్పీటీసీ పెమ్మసాని ప్రసన్న లక్ష్మి, వైస్సార్సీపీ నియోజకవర్గ పంచాయతీ రాజ్ విభాగ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి రవికుమార్ రెడ్డి, నోటి వినయ్ కుమార్ రెడ్డి, సర్పంచ్ బీ వెంకటేశ్వర్లు, సయ్యద్ జమీర్ బాషా, కల్పనారెడ్డి, హేమ తదితరులు పాల్గొన్నారు.