
రుద్రూర్, మే 19 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి):
ద్విచక్ర వాహనదారుడికి హెల్మెట్ శ్రీరామ రక్ష లాంటిదని రుద్రూర్ సీఐ కృష్ణ, ఎస్సై పి.సాయన్న అన్నారు. సీపి సాయి చైతన్య ఆదేశాల మేరకు రుద్రూర్ మండల కేంద్రంలో రుద్రూర్ పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ పై ప్రధాన వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహిస్తు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, మాజీ సర్పంచ్ ఇందూరి చంద్రశేఖర్, ఇందూర్ కార్తిక్, కిసాన్ ఖేత్ అధ్యక్షులు అడప సాయిలు, వివిధ గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.