Monday, September 15, 2025
Homeఆంధ్రప్రదేశ్నరసింహపురంలో ఘనంగా పచ్చ పండుగ నిర్వహించడం జరిగింది గ్రామ పూజారి,ముచ్చిక సింగయ్య, గ్రామ పటేల్,...

నరసింహపురంలో ఘనంగా పచ్చ పండుగ నిర్వహించడం జరిగింది గ్రామ పూజారి,ముచ్చిక సింగయ్య, గ్రామ పటేల్, ముచ్చిక ప్రసాద్,బాలకృష్ణ

Listen to this article

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం నరసింహపురం గ్రామంలో ఘనంగా పచ్చ పండుగ నిర్వహించడం జరిగింది. నరసింహపురం గ్రామంలో గ్రామ పూజారి మరియు గ్రామ పటేల్ మాకు ప్రత్యేకమైన పండుగలో పండుగ పచ్చ పండుగ అని తెలియపరిచారు, ఈ పండుగ ప్రాముఖ్యత ముందుగా ఆ గ్రామంలో గ్రామ దేవతలను శుభ్రం చేస్తారు పసుపు కుంకుమలతో అలంకరించిన తర్వాత పూజాలు చేసి కొబ్బరికాయలు కొట్టి దేవతలకు నైయ్ వైద్యాలు సమర్పిస్తారు, అప్పుడు గ్రామ పూజారి తో పాటు గ్రామస్తులు సమక్షంలో ఈ పండుగ చేయడం మొదలవుతుంది అప్పుడు పండుకి సంబంధించిన కార్యచరణాలు మొదలు పెడతారు అప్పుడు దేవతలకి మొక్కులు చెల్లిస్తారు, మేకలు కోళ్లు దేవతలకు అర్పిస్తారు అప్పుడు ఆ గ్రామంలో ప్రజానికం అందరు కూడా ఈ పండగ అయిపోయిన తర్వాత ఆకుకూరలు కానీ అనేక రకాల కూరగాయలు కానీ కొత్తవి తినడం మొదలుపెడతారు ఏజెన్సీ గ్రామాల్లో ప్రతి గ్రామంలో ప్రతి అనేక చోట్ల ఈ యొక్క పండగను ఘనంగా పూజారి పట్టణ ఆధ్వర్యంలో ఘనంగా చేపడతారు, ప్రతి ఏటా ఈ యొక్క పండగను చేయటం అనేది ఆదివాసి సమాజానికి ఎంతో ప్రాముఖ్యత అని తెలియపరుస్తున్నారు, ఈనాటి సమాజంలో ఇప్పటికి కూడా ఏజెన్సీ గ్రామాల్లో ఆదివాసులంతా ఏకతాటిపై ముందుండి నడిపిస్తూ ఉంటారు ఆనాడు పూర్వికులు చూపిన బాటలో ఇప్పటి యువతరం కూడా ఆ బాటలోనే పయనిస్తూ ఉంటారు,ఇది మన ఏజెన్సీ గ్రామాల్లో ప్రతి గ్రామంలో నిర్వహిస్తారు. ఈ పండగలు కీలకంగా వ్యవహరించే వారు గ్రామ పూజారి, గ్రామ పటేల్, గ్రామ హేపరి వీళ్ళని ఆ గ్రామంలో ముఖ్య పాత్రలుగా పోషిస్తారు, అలాగే ఇటువంటి ఆనాటి కాలం నుండి సాంప్రదాయాలు ఇప్పటి యువతరం కూడా అదే బాటలో ప్రయాణం చేయడం అనేది ఎంతో అభినందనీయమని ఆ యొక్క గ్రామ పూజలు పటేల్ తెలియపరిచారు. పచ్చ పండగ ప్రత్యేకత మా ఆదివాసి సమాజంలో ఈ పండగ అయిపోయిన తర్వాత మా గూడెంలో పండే ప్రతి కూరగాయలు బీరకాయ, ఆనపకాయ, చక్కెరకాయ ఇంకా చాలా రకాల కూరగాయలు ఈ పండగ అయిపోయింది తర్వాత మా ఆదివాసి గూడేలో తినడం మొదలు పెడతారు, మా ఆదివాసి సంప్రదాయ సంస్కృతిలో ఎంతో ప్రాముఖ్యం అని తెలియపరిచారు, ఆదివాసి తెగలలో మాకుఈ పండక్కి ఎంతో ప్రాముఖ్యత ఉంది అని తెలియపరిచారు, ఈ కార్యక్రమంలో పూజారి ముచ్చిక సింగయ్య, ప్రసాద్, బాలకృష్ణ, వెట్టి సత్యం, పద్ధం అర్జున్, వంజం రామారావు, ముచ్చిక కొండయ్య, పద్దం శ్రీను, మడకం మల్లయ్య, ముచ్చిక రాంకుమర్,మడివి వీరయ్య, వెట్టి మూకేశ్, ముచ్చిక లక్ష్మమయ్య,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments