
పయనించే సూర్యుడు న్యూస్ జులై 16 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి ప్రారంభం మొదలైంది. గత సంవత్సర కాలంగా పల్లెల్లో సర్పంచులు లేకపోవడంతో..
ప్రత్యేక అధికారులతో గ్రామాల పరిపాలనను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పుడెప్పుడు పంచాయా అని ఆశావాహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం మొదట ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది. ఈ మేరకు అధికారులకు ప్రభుత్వం సూచనలు కూడా చేసింది. ఎంపీటీసీ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికల నిర్వాహణ ఉండటంతో అధికారులు ఆ విధంగా ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది డేటాను సిద్ధం చేయాలని కలెక్టర్ల కు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో నమోదైన రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది వివరాలను మరోసారి పరిశీలించాలని ఈ సందర్భంగా ఈసీ సూచించినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలోని జిల్లా, రెవెన్యూ, డివిజన్, మండలం, పంచాయతీలతో పాటు వార్డుల సంఖ్య ఆధారంగా..పూర్తి వివరాలు అందుబాటులో ఉండాలని కలెక్టర్లకు ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ఆదేశాలతో త్వరలోనే పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.