
:పయనించే సూర్యుడు: జూన్ 18: మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప:
మక్తల్ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి, సమాజసేవలో ఎప్పుడూ ముందుండే గుంటగారి శివలింగం కుటుంబం మరోసారి తమ మానవతా హృదయాన్ని చాటుకుంది. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, గ్రామపంచాయతీ మక్తల్ లో ఏర్పాటు చేసిన ఒక సేవా కార్యక్రమంలో గుంటగారి శివలింగం సతీమణి శ్రీమతి మంజుల కుమారుడు అనిరుద్ , కుమార్తె అనూష , అల్లుడు ప్రశాంత్ తమ కుటుంబ సభ్యులతో కలిసి దాతృత్వ చాటుకుంటూ పాఠశాలలోని ఆర్థికంగా వెనుకబడ్డ విద్యార్థుల కోసం రూ.32,000 విలువైన నూతన స్కూల్ బ్యాగులను పంపిణీ చేయడం జరిగింది.ఈ విలక్షణ సేవా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మక్తల్ మండల విద్యాధికారి అనిల్ గౌడ్ , “ఇలాంటి ఉదారహృదయ స్ఫూర్తిదాయక దాతలు సమాజానికి వెలకట్టలేని ఆస్తి. విద్యారంగంలో వారికి చేయూతగా నిలిచే వారిని మనం అందరూ గౌరవించాలి” అంటూ గుంట కుటుంబాన్ని హృదయపూర్వకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు శ్రీ కె. అశోక్, బి. దీప, ఆర్.కే. అశోక్ కుమార్, జి. బాబు, శ్రీమతి శ్రీవిద్య, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీమతి లత గారు పాల్గొన్నారు. మక్తల్ పట్టణంలోని ప్రీ-ప్రైమరీ టీచర్లు శ్రీమతి వెంకటమ్మ, విజయలక్ష్మి, దుర్గనా బేగం చంద్రకళ, భాగ్యలక్ష్మి, మంజుల గార్లు కూడా ఈ సందర్భంలో పాల్గొని, దాతలపై ప్రశంసల వర్షం కురిపించారు.విద్యార్థుల తల్లిదండ్రులు గుంట కుటుంబ సభ్యుల మానవతా దృక్పథాన్ని ఎంతో హర్షంతో స్వాగతించి, వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యారంగాన్ని గౌరవంగా చూస్తూ, సమాజానికి కొవ్వొత్తిలా వెలుగులు నింపే గుంటగారి కుటుంబం సమాజానికి ప్రేరణగా నిలిచింది.
