Friday, May 16, 2025
Homeఆంధ్రప్రదేశ్ప్రజల హక్కులను కాపాడిన మహోన్నత వ్వక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

ప్రజల హక్కులను కాపాడిన మహోన్నత వ్వక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

Listen to this article

బీజేపీ మాజీ సర్పంచ్ గొట్టుముక్కుల సంపత్ రావు..

పయనించే సూర్యుడు // ఏప్రిల్ // 14 // కుమార్ యాదవ్,// హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ )..

వీణవంక మండలం లోని బేతిగల్ గ్రామంలో, ఘనంగా, డాక్టర్. బి అర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిపారు. భారత రాజ్యాంగ రూపకర్త, భారతరత్న బీ ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా, బేతిగల్ లో అంబేద్కర్ ఫొటో కి , గ్రామ నాయకులు, ప్రజలు, పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఇ సందర్బంగా సంపత్ రావు మాట్లాడుతూ…దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక, సామాజిక న్యాయ రాజకీయ రంగాల్లో సమన్యాయం ఉండాలని ఆకాంక్షించి , భావి తరాల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని, అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించిన, భారత రత్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్, ఒకవర్గానికి చెందిన వారు కాదని, ఈ సమాజంలోని ప్రజలందరి వారని, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం రాసిన గొప్ప వ్యక్తి, అని ప్రజల హక్కుల కాపాడిన మహోన్నత వ్యక్తి, అని అన్నారు.విద్యాభ్యాసం తరువాత ఆర్థిక వేత్తగా ప్రొఫెసర్ గా, న్యాయవాదిగా పలు పాత్రలు పోసించారని తెలిపారు. అన్ని వర్గాల అభ్యున్నతికి విద్యా, ఉద్యోగ, రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని, అంబేద్కర్ సూచనలతో కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించడం, తో దళిత గిరిజన ప్రజల జీవితాల్లో వెలుగులు నింపయన్నారు. ఇ కార్యక్రమంలో, గ్రామ నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments