
పేరూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. గుర్రం కృష్ణప్రసాద్.
పయనించే సూర్యుడు:జూన్ 14: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి.రామ్మూర్తి.ఎ.
వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పేరూరు, ధర్మారం, అయ్యవారిపేట, కృష్ణాపురం, టేకులగూడం, చండ్రుపట్ల గ్రామాలలోని ప్రజలకు పేరూరు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గుర్రం కృష్ణ ప్రసాద్ ఆయా గ్రామాల ప్రజలను ఉద్దేశించి,విజ్ఞప్తి మరియు హెచ్చరికచేశారు. రేపటి నుండి ఆయా గ్రామాల ప్రజలు తమ ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పని సరిగా హెల్మెంట్ తప్పనిసరిగా ధరించవలెనని, ట్రిపుల్ రైడ్ (ఒకే ద్విచక్ర వాహనం పైన ముగ్గురు వ్యక్తులు)ప్రయాణించరాదనీ అలాగే వాహనాలు కు సంబందించిన పేపర్స్ (ఇన్సూరెన్స్ డ్రైవర్ లైసెన్సు వాహన లైసెన్స్ )తప్పని సరిగా కలిగి ఉండవలెను రేపటి నుండి అనగా 15-06-2025 నుండి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి హెల్మెంట్ లేని వాహనాలను సీజ్ చేసి ఫైన్ వేయబడుననీ లియజేశారు.
ఒకవేళ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంగించినయెడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరంచారు.