
స్పందించని మండల విద్యాధికారులు
ఎంఈవో వెంటనే స్పదించి విద్యార్థులకు తాగు న్యాయం చేయాలి.
SFI రంగా రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వడ్ల శ్రీకాంత్ మాట్లాడుతూ
( పయనించే సూర్యుడు జూన్ 21 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )
ఈ రోజు ఎస్ఎఫ్ఐ షాద్ నగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎస్ఎఫ్ఐ ఆఫీస్ పత్రిక ప్రకటన విడుదల చేయడం జరిగింది.ఒక పక్క ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజ్ లా దోపిడీతో పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తుంటే మరో పక్క ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో మూత్రశాలలు కడిగిపిస్తున్నారు విద్యార్థులకు చదువు అధించాల్సిన ఉపాధ్యాయులే ఈ విధంగా వారి బాధ్యత మరిచి ప్రవర్తిస్తున్న పరిస్థితి. ఫరూక్ నగర్ మండలం నేరేలచెరువు గ్రామంలో విద్యార్థులతో ఉపాధ్యాయులు మూత్రశాలలు కడిగిపిస్తే పట్టిగడ్డ టీచర్ లు మాత్రం మేము తక్కువ అని 7 మంది ఉపాధ్యాయురాలు తమ విధులకు సెలవు పెట్టి మరి వారి యొక్క సొంత అవసరాలకి వెళ్లారు.అయినప్పటికీ, ప్రభుత్వ బడులు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. వీటిలో మౌలిక సదుపాయాల కొరత, ఉపాధ్యాయుల లేమి, నాణ్యమైన విద్యా పద్ధతుల లోపం మరియు నిధుల కొరత ప్రధానమైనవి. చాలా ప్రభుత్వ బడుల్లో తగిన గదులు, శుభ్రమైన తాగునీరు, మరుగుదొడ్లు, లైబ్రరీలు మరియు ల్యాబ్లు లేకపోవడం ఒక సాధారణ సమస్య. ఇంకా, ఉపాధ్యాయుల శిక్షణ మరియు నియామక ప్రక్రియలో లోపాలు విద్య నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. మరో పక్క విద్యా బుద్దులు చెప్పాల్సిన గురువువులు వారికీ సహకరించడం లేదు ఇలా అయితే పేద విద్యార్థులు ఎలా చదువుకుంటారు.వారు ఉన్నత స్థానాలకు ఈ విధంగా వెళ్తారు అని మేము అధికారులను ప్రశ్నిస్తున్నాము.ఈ కార్యక్రమంలో SFI టౌన్ కార్యదర్శి శివ శంకర్, తరుణ్, వినయ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.