Wednesday, June 25, 2025
Homeఆంధ్రప్రదేశ్బ్యాంకు ఖాతాదారులు అపరిచిత కాల్స్ పట్ల అప్రమత్తం అవసరం

బ్యాంకు ఖాతాదారులు అపరిచిత కాల్స్ పట్ల అప్రమత్తం అవసరం

Listen to this article

అక్షరాస్యత పొదుపు సైబర్ క్రైమ్స్ పై అవగాహన

పయనించే సూర్యుడు జూన్ 25 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)

జాగ్రత్తగా లేకుంటే జేబుకు చిల్లి పడుతుందని, గ్రామీణులు ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కలిగి ఉండాలని వెలుగు ఏపీఎం సుజీవన, ట్రీస్ స్వచ్ఛంద సేవ సంస్థ సెక్రటరీ షేక్.అహ్మద్ కోరారు. చేజర్ల పట్టణంలోని ఎంపీడీఓ సమావేశ మందిరంలో ఆర్బీఐ వారి సౌజన్యంతో పొదలకూరుకి చెందిన ట్రీస్ స్వచ్ఛంద సేవా సంస్థ బ్యాంకు ఖాతాదారులకు ఆర్థిక అక్షరాస్యత . సైబర్ మోసాలపై అప్రమత్తత పై అవగాహన సదస్సు నిర్వహించారు. బ్యాంక్‌ సేవలు, ఆర్థిక మోసాలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రంమలో భాగంగా పలు రకాల బ్యాంకు పథకాలు, సేవల పై సంపూర్ణ అవగాహన కల్పిస్తూ ప్రదర్శించిన గోడపత్రికలు చూపరులను ఆకొట్టుకున్నాయి. సంస్థ రిసోర్స్ పర్సన్స్ కె.వెంకటేశ్వర్లు, ఎ.చంద్రశేఖర్ మాట్లాడుతూ పొదుపు అవసరం , సైబర్ నేరాలపై బ్యాంక్‌ ప్రతినిధులమంటూ అపరిచితుల నుంచి వచ్చే మేసేజ్‌లు, ఫోన్‌ కాల్స్‌కు స్పందించవద్దన్నారు. ఫోన్‌కు వచ్చే ఓటీపీ, డెబిట్‌ కార్డుల పిన్‌, సీవీవీ వంటి నంబర్లు ఇతరులకు చెప్పవద్దన్నారు. అలాంటి గోప్యతా వివరాలను బ్యాంకులు అడగవని గుర్తించాలన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఖాతాదారులకు అందిస్తున్న ప్రత్యేక పథకాలు, సేవలను ఖాతాదారులకు వివరించారు. వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలను ఎలా తయారు చేసుకోవాలో వివరించారు. నగదు రహిత లావాదేవీలు నిర్వహించడానికి ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించారు. ఫిర్యాదుల వ్యవస్థను ఉపయోగించుకొని సత్వర సక్రమ ఆర్థిక సేవలను పొందాలన్నారు. బ్యాంకింగ్ అంబుడ్స్ మెన్ ను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెలుగు సీసీ లు, సుధాకర్,నారాయణ మ్మ, వీఓఏ . ట్రీస్ ప్రెసిడెంట్ నౌరాజ్, బ్యాంకు ఖాతాదారులు, స్థానికులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments