
రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావును కలిసిన దృశ్యం..
రుద్రూర్, జూలై 11 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావును, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడి ఎల్లారెడ్డిని శుక్రవారం మండల బిజెపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దొరబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు సున్నం సాయిలు, ప్రశాంత్ గౌడ్, ఈల్తేమ్ శంకర్, రుద్రూర్ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, కటిక రామ్ రాజు, కృష్ణం రాజు,కుమ్మరి గణేష్, బోజిగొండ అనిల్, వివిధ ఆరు మండలాల సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.