
బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు..
రుద్రూర్, జూన్ 02 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరిస్తూ తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గాండ్ల మధు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దౌర్ సాయిలు, పార్టీ యువజన విభాగం అధ్యక్షులు క్లిక్ రవి, బొట్టే గజేందర్, శేఖర్, నీరేడి సాయిలు, ఆర్. పోచయ్య, సాయి కిరణ్, పున్న పురుగయ్య, శంగిరి వీరన్న, చాంద్ పాషా, తదితరులు పాల్గొన్నారు.