
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూన్ 26
జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో ది.27.06.2025 నాడుఉదయం 11 గంటలకు గోదావరి – శబరి వరద సమీక్ష సమావేశం ఐటిడిఏ చింతూరు వారి కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుంది అని ప్రాజెక్టు అధికారి ఐటిడిఏ చింతూరు వారు పేర్కొన్నారు. కావున నాలుగు మండలల ప్రజా ప్రతినిధులు,ముంపుకు గురి అవుతున్న గ్రామల యొక్క సర్పంచులు మరియు గ్రామ పెద్దలు ఈ సమావేశంకు హాజరు అయి వారి గ్రామంకు కావలిసిన కనీస సదుపాయాలు గురించి ఒక దరఖాస్తు రూపంలో సమర్పించవలసినదిగా ప్రాజెక్ట్ అధికారి ఐటిడిఏ చింతూరు వారు చెప్పినారు. కావున ప్రజా ప్రతినిధులు మరియు గ్రామ పెద్దలు ఈ గోదావరి శబరి వరద సమీక్ష సమావేశం లో పాల్గొని వారి యొక్క లోటు పాట్లు ను తెలియజేయాలని అని ప్రాజెక్టు అధికారి ఐటిడిఏ చింతూరు వారు చెప్పినారు. నాలుగు మండలల మీడియా మిత్రులతో ఈ సమావేశం తరువాత ప్రెస్ మీట్ ఉంటుంది కావున మీడియా మిత్రులు అందరూ కూడా హాజరు కావాల్సిన దిగా కోరుతున్నాము