Friday, August 15, 2025
Homeఆంధ్రప్రదేశ్రైతుల సంక్షేమానికి సహకార బ్యాంకులు ఉపయోగ పడాలి- మంత్రి శ్రీధర్ బాబు

రైతుల సంక్షేమానికి సహకార బ్యాంకులు ఉపయోగ పడాలి- మంత్రి శ్రీధర్ బాబు

Listen to this article

కమాన్ పూర్ మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం, సహకార బ్యాంకు బ్రాంచ్ ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

పయనించే సూర్యుడు న్యూస్ పెద్దపల్లి,కమాన్ పూర్, ఆగస్టు-11

రైతుల సంక్షేమానికి సహకార బ్యాంకులో ఉపయోగ పడాలని రాష్ట్ర ఐ.టి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు.సోమవారం మంథని ప్రాంతంలో రాష్ట్ర మంత్రి కమాన్ పూర్ మండలంలో 65 లక్షలతో నిర్మించిన నూతన పి.ఎ.సి.ఎస్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం) భవనాన్ని, 79 లక్షలతో నిర్మించిన జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ బ్రాంచ్ భవనాన్ని, కరీంనగర్ డి.సి.సి.బి చైర్మన్ రవీందర్ రావు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష లతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, కమాన్ పూర్ మండలంలో సహకార బ్యాంకు బ్రాంచ్ ప్రారంభించిన సందర్భంగా రైతులకు సహకార సంఘ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.ప్రజా ప్రభుత్వం లో గత సంవత్సర కాలంలో రైతు సంక్షేమం దిశగా రాజీ లేకుండా చర్యలు చేపట్టామని అన్నారు. జిల్లా సహకార కేంద్రం బ్యాంక్ బ్రాంచ్ నందు డిపాజిటర్లకు, కస్టమర్లకు అన్ని రకాల సౌకర్యాలు ఉండే విధంగా నిర్మించడం జరిగిందని అన్నారు. పేద ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలను వారికి చేర్చేందుకు బ్యాంకులు ఉపయోగ పడతాయని అన్నారు.రైతుల సంక్షేమం దృష్ట్యా సహకార బ్యాంకులో దోహదపడతాయని అన్నారు.రైతులకు అందుబాటులో ఉండే విధంగా కమాన్ పూర్ మండల కేంద్రం లో సహకార బ్యాంక్ బ్రాంచ్ ఏర్పాటు చేశామని అన్నారు. కరీంనగర్ డి.సి.సి.బి చైర్మన్ రవీందర్ రావు మాట్లాడుతూ, కమాన్ పూర్ మండలంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనాన్ని, సహకారం బ్యాంక్ బ్రాంచ్ భవనాన్ని మంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని అన్నారు.కేంద్ర సహకార బ్యాంకులో 72 శాఖలు ఉంటే 32 భవనాలు నిర్మించుకోవడం జరిగిందని,సహకార సొసైటీ ద్వారా కూడా భవనాలు బ్యాంకుకు అద్దె ఇవ్వడం జరుగుతుందని అన్నారు. గతంలో 70కోట్ల నష్టం 400 కోట్ల వ్యాపారంతో ఉన్న సహకార బ్యాంకును నేడు 7200 కోట్ల వ్యాపారం, 120 కోట్ల లాభాలతో నడిచేలా అభివృద్ధి చేశామని, ప్రతి సంవత్సరం కస్టమర్లకు వాటాదారులకు బోనస్ కూడా అందిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నన్నయ గౌడ్, ఆర్.డి.ఓ. సురేష్, తహసిల్దార్, ఎంపిడిఓ, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments