
( పయనించే సూర్యుడు జూన్ 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ వి6 రిపోర్టర్ రాజేష్ ను భారత రాష్ట్ర సమితి యువ నాయకులు, కేశంపేట మాజీ ఎంపీపీ వై రవీందర్ యాదవ్ పరామర్శించారు. రిపోర్టర్ వి6 రాజేష్ తండ్రి నులి నర్సింగ్ రావు స్వర్గస్తులు కావడంతో ఈ సమాచారం తెలుసుకున్న రవీందర్ యాదవ్ రాజేష్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన తండ్రి మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో నమస్తే తెలంగాణ రిపోర్టర్ కృష్ణ తదితరులు ఉన్నారు.