
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ జూన్ 28
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు లో కూటమి ప్రభుత్వ సారది, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం రూపకల్పన, మెగా డిఎస్సి 2025 ఏజెన్సీ ప్రాంత ఉపాద్యాయ ఉద్యోగాలు స్థానిక ఎస్టీ అభ్యార్దులతో భర్తీ చేయనున్నట్టు పాడేరు డిక్లరేషన్ ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి జిల్లా చైర్మన్ రామారావు దొర డిమాండ్ చేసారు. ఈరోజు జి.యస్.యు లైబ్రరీ భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ “స్థానిక గిరిజనులకే ఏజెన్సీలో ఉద్యోగాలు” అంటూ గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ జులై 1 న పాడేరులో జరగనున్న బహిరంగ సభలో ప్రకటించాలని కోరారు.
2025 మెగా డిఎస్సిలో ప్రకటించిన ఏజెన్సి ప్రాంత ఉపాద్యాయ పోస్టులను స్థానిక ఎస్టి అభ్యర్థులతోనే భర్తీ చేయనున్నట్టు ప్రకటించి ఆదివాసి నిరుద్యోగులకు బరోషా ఇవ్వాలని, ఆదివాసులకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. ఐదో షెడ్యూల్డ్ ప్రాంతంలో రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హక్కులకు బంగం కలగకుండా చూడవలసిన బాద్యత ప్రభుత్వానిదేనని, జివో నంబర్ 3 రద్దుని సాకుగా చూపి, ఉద్యోగులు పేరిటా ఆదివాసేతరులను ఐదో షెడ్యూల్డ్ ప్రాంతానికి చొప్పించడం వలన చదువుకున్న ఆదివాసి నిరుద్యోగ యువతకు మాత్రమే నష్టం కాదని, యావత్తూ ఆదివాసుల సామాజికి, ఆర్ధిక, రాజకీయ, భూ హక్కులపై తీవ్ర ప్రభావం చూపుతుందని రామారావు దొర ఆవేదన వ్యక్తంచేశారు. సుఫ్రింకోర్టు తీర్పు వెల్లడించిన నాటి నుండి గత ఐదేళ్ళుగా “షెడ్యూల్డ్ ఏరియా ఉద్యోగ నియామకాల చట్టం” చేయాలనీ ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తుందన్నారు. షెడ్యూల్డ్ ఏరియా ఉద్యోగ నియామకాల చట్టం ద్వారా ఆదివాసులకు శాశ్వత ఉద్యోగ బద్రత కలిపించుటకు ఆదివాసి జెఎసి చేస్తున్న డిమాండ్ కు సానుకులంగా స్పందించిన ప్రభుత్వం ఉద్యోగ నియామకాల చట్టం రూపకల్పనతో పాటు, మెగా డిఎస్సిలో ప్రకటించిన ఏజెన్సి పోస్టులను స్థానిక ఎస్టి అభ్యర్థులతో భర్తీ చేయాలని కోరారు.ఇప్పటికే, షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలనీ ప్రభుత్వానికి పలుమార్లు వినతులు ఇవ్వడంతో పాటు చట్టం డ్రాఫ్ట్ కాఫిని కూడా సిఎంఓ కార్యాలయానికి అందజేసినట్టు ఆదివాసి జెఎసి నాయకులు మీడియాకు తెలిపారు. ప్రభుత్వం ఆలశ్యం చేసిన త్వరితగతిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రావ్యప్తంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమానికి గిరిజన విద్యార్థి సంఘం నాయకులు బూడిదే మాధవరావు, బోయినీ అనిల్, మణుగూరు బాబుజి, సురేష్ కుమార్, శంకర్, అప్పారావు , రాజారావు, రవి, టి. సత్యనారాయణ నాయుడు తదితరులు పాల్గొన్నారు.