Wednesday, April 16, 2025
Homeఆంధ్రప్రదేశ్సిరులు పండించే కొర్రమీను..

సిరులు పండించే కొర్రమీను..

Listen to this article

కొర్రమీను చేపల పెంపకంతో లక్షల్లో లాభాలు..

కొర్రమీను చేపల పెంపకానికి మహిళలు ముందుకు రావాలి..

ఒక్కసారి పెట్టుబడితో నిరంతర ఆదాయం..

కొర్రమీను పెంపకంలో రాష్ట్రానికి జిల్లా ఆదర్శం కావాలి..

కొర్రమీను చేపల పెంపకం పై అవగాహన సదస్సులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు )

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిరులు పండించే కొర్రమీను చేపల పెంపకం ద్వారా మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం కొత్తగూడెం క్లబ్ లో జిల్లాలోని మహిళా సమాఖ్య సభ్యులకు, వ్యవసాయ శాఖ ఏపీఎంలకు కొర్రమీను చేపల పెంపకం పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ వ్యవసాయం అన్ని సమయాల్లో కలిసి వస్తుందని గ్యారంటీ లేదు.. ఎందుకంటే వర్షాలు ఎక్కువ పడిన ఇబ్బందే .. తక్కువ పడినా కూడా ఇబ్బందే.. ప్రకృతి సహకరిస్తేనే అధిక దిగుబడిని పొందగలరు. కానీ, అకాల వర్షాల కారణంగా పంట చేతికి అందకుండా పోతుంది. దీంతోపాటు ఇంట్లో ఉన్న మహిళలు మగవాళ్లు అందరూ మరియు వ్యవసాయ కూలీలు నిరంతరం కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి ఒక్కసారి పెట్టుబడితో నిరంతరం ఆదాయం వచ్చే చేపల పెంపకం పైన రైతులు దృష్టి సారించాలని ఆయన తెలిపారు. ఈ చేపల పెంపకంలో కొర్రమీను మాత్రమే ఎందుకు చెప్తున్నామంటే అది ఎటువంటి వాతావరణం అయినా తట్టుకుని బురదలో అయినా బతికే చేప కాబట్టి అని తెలిపారు. కొర్రమీను చేపల పెంపకం కొరకు ఎక్కువ ప్రదేశం కూడా అవసరం లేదని ఒక పావుగుంట ప్రదేశంలో వాటర్ ట్యాంక్ నిర్మాణం ఇంకో పావు కుంట ప్రదేశంలో ఫామ్ పౌండ్ నిర్మాణం, సుమారు మూడు లక్షల యాభై వేల రూపాయలతో చేపల పెంపకానికి అవసరమైన అన్ని వాటర్ ట్యాంక్,దానా వంటివి తయారు చేసుకోవచ్చని తెలిపారు. ఒక్కో చేప పిల్ల ఖరీదు 15 రూపాయలు కాగా 1000 చేపల పిల్లల పెంపకం చేపట్టి అందులో 100 చేప పిల్లలు చనిపోయిన 900 చేప పిల్లలు మీ చేతికి వస్తే కిలో సుమారు 300 రూపాయలకు అమ్మిన 2,70,000 రూపాయలు కేవలం 7 నెలల్లో చేతికి వస్తుందని తెలిపారు. కొర్రమీను చేపల పెంపకం యూనిట్ స్థాపన కొరకు బ్యాంకుల ద్వారా పీఎం ఈ జిపి పథకం ద్వారా 35 శాతం సబ్సిడీ వస్తుందని, చేపల పెంపకానికి కావలసిన ఫామ్ పౌండ్ నిర్మాణం ఉపాధి హామీ పథకం ద్వారా ఉచితంగా నిర్మించవచ్చని కలెక్టర్ తెలిపారు. ఈ కొర్రమీను చేపల పెంపకం ద్వారా కేవలం రెండు సంవత్సరాల లోనే పెట్టుబడి వాపసు వస్తుందని లక్షల్లో ఆదాయం చేకూరుతుందని మరి ఇతర పంటల్లోనూ ఇంత ఆదాయం రాదని అందువలన జిల్లాలోని రైతులు మహిళా సమాఖ్య సభ్యులు అధిక సంఖ్యలో కొర్రమీను చేపల పెంపకం చేపట్టాలని సూచించారు. కొర్రమీను చేపల పెంపకంలో నాణ్యమైన దానా వాడాలని, రోజుకు ఐదుసార్లు చేపలకి దాన వేయాలని ఆయన సూచించారు. ఈ దాన అనేది ఆటోమెటిక్ గా సరఫరా అయ్యే విధంగా ప్రయోగాలను శాస్త్రవేత్తలతో కలిసి నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. చేప పిల్లల్ని వాటర్ ట్యాంకర్ లో నాలుగు నెలలు పెంచిన తర్వాత వాటిని నీటి కుంటలో మట్టి మరియు విశాలమైన ప్రదేశంలో పెంచడం ద్వారా పెద్ద పరిమాణంలో తయారవుతాయని తెలిపారు. వాటర్ ట్యాంక్ ఇళ్లలో నీటిని కూరగాయల సాగుచేయవచ్చని తెలిపారు. ఈ విధంగా రైతులు సాగు చేస్తే ప్రపంచం లో అతి పెద్ద మహమ్మారి వచ్చిన కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది పడరు. సాఫ్ట్ వెర్ ఉద్యోగస్థులకు దీటుగా వ్యవసాయం లో లాభాలను పొందవచన్నారు. జిల్లాలోని రైతులు మహిళా సమైక్య సభ్యులు ముందడుగు వేసి కొర్రమీను చేపల పెంపకం చేపట్టి రాష్ట్రానికి చేపల పెంపకంలో మన జిల్లా ఆదర్శంగా నిలవాలన్నారు. ఈ చేపల పెంపకం యూనిట్ల స్థాపనకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. అనంతరం ఆక్వా కనెట్స్ సమస్త వారు కొర్రమీను చేపల పెంపకం, మార్కెటింగ్, చేపల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పై రైతులకు మరియు మహిళలకు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన మరియు సందేహాల నివృత్తి చేపట్టారు. అనంతరం జిల్లాలో ప్రయోగాత్మకంగా అశ్వాపురం మరియు సుజాతనగర్ లో స్థాపించి కొర్రమీను చేపల పెంపకం లో విజయం సాధించిన రైతులు దుర్గాప్రసాద్ మరియు జంపన్న వారు చేపడుతున్న చేపల పెంపకం లో వారి అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఈ అవగాహన సదస్సులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ రెడ్డి, పరిశ్రమల శాఖ మేనేజర్ తిరుపతయ్య, మత్స్య శాఖ ఏడి ఇంతియాజ్ ఖాన్ మరియు ఆక్వా కనెట్స్ సంస్థ ప్రతినిధులు, మహిళా సమైక్య సభ్యులు మరియు ఏపిఎంలు సుమారు 400 మంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments