
పయనించే సూర్యుడు ఆగస్టు 6 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఏన్కూరు నందు సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ఎస్.ఐ మహ్మద్ రఫీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు అపరిచిత వ్యక్తుల కాల్స్, ఈమెయిల్స్, వాట్సాప్ లింక్స్ బ్యాంకు అకౌంట్ మెసేజ్ ల పట్ల జాగ్రతగా ఉండాలని సూచించారు విద్యార్థులు సెల్ ఫోన్ ద్వారా సమాచారం తెలియని వారికి పంపకుండా జాగ్రత్త పడాలని, చాట్స్, మెసేజెస్ ఓపెన్ చేయకుండా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె. రాఘవరావు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు