Saturday, May 17, 2025
Homeతెలంగాణకోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్

కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్

Listen to this article

తిరుపమ్మ సుధీర్ ను సన్మానించిన పలువురు కాంగ్రెస్ పార్టీ పెద్దలు యూత్ నాయకులు
పయనించే సూర్యడు జనవరి 20 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు
కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా ఎన్నికైన మండల కేంద్రానికి చెందిన వేపూరి తిరుపమ్మ సుదీర్ ను నడిగూడెం మండలం చెందిన పలువురు నాయకులు పెద్దలు యువకులు కలిసి సోమవారం ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువకుడిగా నీతి నిజాయితీగా పార్టీ కోసం కార్యకర్తల కోసం కష్టపడ్డ కార్యకర్తకు పార్టీ గుర్తించి పదవి ఇవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు రైతుల సమస్యలు పరిష్కరించి ప్రజలకు మరింత సేవ చేసి పార్టీకి గ్రామానికి మండలానికి నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలన్నారు అందరికీ అందుబాటులో ఉండి పార్టీ కోసం ప్రజల కోసం కష్టపడ్డ నిరుపేద కార్యకర్త ను గుర్తించి చైర్మన్ పదవిని ఇచ్చిన రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు చైర్మన్ తిరుపతమ్మ సుదీర్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి పదవి ఇచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతికి ధన్యవాదాలు తెలిపారు అందరి సహకారంతో మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గడ్డం నాగలక్ష్మి మల్లేష్ పగడాల ప్రభాకర్ పద్మ ఎక్స్ వైస్ ఎంపీపీ బడేటి వెంకన్న సీనియర్ నాయకులు దేవ బత్తిని రమేష్ కాసాని పాలడుగు ప్రసాద్ అర్జున్ రావు ఉపేదర్ పుల్లయ్య కాసాని విమల వెంకన్న చలపతి రాంరెడ్డి వేంకటేశ్వర్లు వెంకన్న బాణాల నాగరాజు శివలింగం శివకృష్ణ రాము భారీ వెంకన్న అబ్బిరెడ్డి శ్రీను మురళి తిరుమలి తదితరులు ఉన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments