పయనించే సూర్యుడు న్యూస్: రామగిరి,సెంటినరీ కాలనీ-01: సింగరేణి సంస్థ అటవీ, పర్యావరణ సలహాదారు ఎం.సి.ఫర్గెయిన్ శనివారం రామగుండం రీజియన్ లో పర్యటించారు. పదవీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత మొదటిసారిగా విచ్చేసిన సందర్భంగా వారిని ఇల్లందు క్లబ్ నందు రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాతో సత్కరించి, మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వారితో పాటు ఎస్టేట్స్ అధికారి కె.ఐలయ్య, తదితరులు ఉన్నారు.
ఫారెస్ట్ & ఎన్విరాన్మెంట్ అడ్వైజర్ ను కలిసిన ఆర్.జి. జి.యం
RELATED ARTICLES