
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు
డివిజన్ ఇంచార్జ్ జూన్ 30 సోమవారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ (274/16) ఆధ్వర్యంలో ఐటీడీ ఎదుట నిరసన తెలియజేసి ప్రజా గ్రీవెన్స్ నందు ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ వారికి అక్రమ కట్టడాల కూల్చివేత ప్రక్రియలో జరుగుతున్న అవకతవ కాలపై మరియు అక్రమ మైనింగ్ పై, గిరిజనఏతరుల భూ ఆక్రమణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ గౌరవ న్యాయస్థానాల ఉత్తర్వులు మేరకు, ప్రభుత్వ జీవోలు ఆదేశాల మేరకు అలాగే ఏజెన్సీ ప్రాంతంలోని 1/70 చట్టం మరి ఇతర ఏజెన్సీ చట్టాలు ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలోకి వలసలు వచ్చి ఏజెన్సీ ప్రాంతాన్ని మొత్తం ఆక్రమించుకొని ప్రభుత్వ ఆదివాసి భూములను దురాక్రమంగా కబ్జా చేసి ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా స్థిర నివాసాలు ఏర్పాటు చేసి వ్యాపారాలు వ్యవసాయాలు చేస్తున్న నాన్ ట్రైబలస్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రంపచోడవరం డివిజన్లో అడ్డతీగల మండల కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా కొసరి కొసరుగా అక్రమ కట్టడాలు కూల్చారని, అలాగే దేవి పట్నం లోని ఇందుకూరుపేట, రాజవోమాంగి మండల కేంద్రం, వై రామవరం మండల కేంద్రంలో అక్రమాలు కూల్చడానికి మార్కింగ్ వేసి అక్రమ కట్టడాలు కూల్చకుండా నాన్ ట్రైబలస్ నుండి స్థానిక పంచాయితీ మరియు రెవెన్యూ అధికారులు మరి కొంతమంది రాజకీయ నాయకులు డబ్బులు వసూలు చేసి కూల్చే ప్రక్రియను నిలుపుదల చేశారని ఈ విషయంపై స్థానిక అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిఓ గారిని, ప్రభుత్వాన్ని కోరారు. డివిజన్లో మరికొన్ని ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు గుర్తింపు ప్రక్రియ అసలు మొదలు కాలేదని తెలిపారు. అక్రమ కట్టడాలు కూల్చివేత మారేడుమిల్లిలో ఒకలాగా రంపచోడవరంలో ఒకలాగా అడ్డతీగలలో ఒకలాగా కూల్చారని ఇది పూర్తిగా చట్ట విరుద్ధమని ఎవరికి నచ్చినట్లు వాళ్ళు కూల్స్తే ఇంకా కోర్టు ఆదేశాలకు, ప్రభుత్వ ఉత్తర్వులకు గౌరవం ఎక్కడదని, ఇదంతా కూడా కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించిన ప్రతి అధికారిపై కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అంతేకాక రంపచోడవరం డివిజన్లో పలు అక్రమ మైనింగ్ ల పై ముఖ్యంగా రంపచోడవరం మండలం నరసాపురం గ్రామంలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్ పై పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేయడం జరిగింది. నర్సాపురం మెటల్ క్వారీ సుమారు పది ఎకరాలు ఉంటుందని అక్కడ 2019 నుంచి ఇప్పటికి అక్రమ మైనింగ్ కొనసాగుతుందని కొవ్వూరు కు చెందిన ఓ గిరిజనయేతరులు స్థానికంగా బినామీలను పెట్టి ఎటువంటి లైసెన్సులు లేకుండా NOC లు లేకుండా కోట్లాది రూపాయలు మైనింగ్ను ప్రభుత్వానికి టాక్స్ కట్టకుండా అటు గ్రామ అభివృద్ధికి ఎటువంటి నిధులు చెల్లించకుండా అక్రమంగా దండుకుంటున్నారని, అసలు ఆ క్వారీలకి చట్టపరంగా నిబంధన ప్రకారం ఎటువంటి బ్యాంక్ అకౌంట్ లేదని దీని మూలాన నిధులు దుర్వినియోగం జరుగుతుందని ఆ క్వారీపై ఇప్పటివరకు ఎటువంటి దర్యాప్తు జరగలేదని పిఓ గారికి తెలియజేశారు. దీనిపై పిఓ గారు స్పందిస్తూ తక్షణమే ఎంక్వైరీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలియజేశారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలోని చట్టాలు అమలు అవ్వాలన్న, హక్కులు దక్కాలన్న ఆదివాసీలు మేలుకోవాలని, పార్టీలతో సంబంధం లేకుండా ఉద్యమిస్తేనే రాజ్యాంగ పలాలను పొందగలమని తెలియజేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న అక్రమ కట్టడాల కూల్చివేత ఆగకుండా ముందుకు సాగాలంటే గ్రామస్థాయి నుంచి ఉద్యమం మొదలు అవ్వాలని లేకుంటే స్థానిక ప్రభుత్వా అధికారులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు నాన్ ట్రైబల్స్ కి కొమ్ముకాస్తూ ఏజెన్సీ చట్టాలకు తూట్లు పొడుస్తారని తెలియజేశారు. ఇటువంటి ఆదివాసి ద్రోహులు వలనే మొదటిలో అక్రమ కట్టడాలు కూల్చివేత వేగంగా ఉన్నత అధికారులు చేపడుతుంటే, అక్రమ కట్టడాలు తొలగింపు ప్రక్రియ ను తూతూ మంత్రంగా కొనసాగే విధంగా రాజకీయం చేయడం వలన తూతూ మంత్రంగా అక్రమ కట్టడాలు తొలగింపు ప్రక్రియ కొనసాగిందని అన్నారు. గిరిజనయేతర్లకు కొమ్ముకాస్తున్నటువంటి ప్రజా ప్రతినిధులు, స్తానిక అధికారులు ఆదివాసి ద్రోహులని విమర్శించారు. భూకబ్జాలకు పాల్పడేవారు అంతకులతో సమానమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం హర్షించదగ్గ విషయమని, కానీ ప్రభుత్వాలు ఆదేశాల మేరకు స్థానిక అధికారులు పనిచేయకపోవడం సిగ్గుచేటని స్వయంగా ముఖ్యమంత్రి గారే భూ అక్రమాలపై ఉక్కు పాదం మోపాలని చెప్తా ఉంటే ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం 1/70 చట్టాన్ని అమలు చేయకుండా ఏజెన్సీ చట్టాలను నాన్ ట్రైబల్స్ కి తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. ఆదివాసి చట్టాలు కేవలం పేపర్ చట్టాలుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తపరిచారు. ఇప్పటికైనా న్యాయస్థానాలు, ప్రభుత్వ జీవోలు ఆదేశాల మేరకు మరియు ఏజెన్సీ చట్టాలు నిబంధనల మేరకు ఏజెన్సీ ప్రాంతంలోని భూ అక్రమాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్రమ కట్టడాలు తొలగింపు ప్రక్రియ అన్ని ప్రాంతాల్లో వేగవంతం అవ్వాలని, కొలతలతో సంబంధం లేకుండా అన్ని అక్రమ కట్టడాలు కూల్చివేయాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకుంటే ఆదివాసులే అక్రమ కట్టడాలు కూల్చివేతకు పూనుకుంటారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు తీగల బాబురావు, డివిజన్ అధ్యక్షులు మోడీది నూకరాజు, డివిజన్ నాయకులు పీట ప్రసాద్, చోడి ఏడుకొండల దొర, కంగాల అబ్బాయి దొర, కడబాల శ్రీనుబాబు, చిలకల గుణేశ్వరరావు, వెన్నెల చిన్నారావు, మామిడి ఈశ్వర రెడ్డి, కారు శివలింగ బాబు, చంద్ర రావు తదితరులు పాల్గొన్నారు
