
రుద్రూర్, జూన్ 25 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :
రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామానికి వెళ్లే రహదారి ప్రక్కన రుద్రూర్ గ్రామానికి చెందిన కాడే చిన్న సాయిలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బుధవారం ఉదయం స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ విజయ్ బాబు, రుద్రూర్ ఎస్సై సాయన్న ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెంది ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ మృతికి కారణమైన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై సాయన్న కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.